BJP Manifesto: అధికారంలోకి వస్తే యూనిఫాం సివిల్ కోడ్ తెస్తాం.. వక్ఫ్ భూములపై విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Promises Uniform Civil Code In Himachal If Voted Back To Power: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ఆదివారం రోజున పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ మేనిఫేస్టోను విడుదల చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో మళ్లీ అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడుతామనే విషయాలను మేనిఫేస్టోలో వివరించారు. 11 హామీలను ఇచ్చారు. ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేస్తామని ప్రకటించారు.
Read Also: By elections: నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యం.. 4 స్థానాలు కైవసం చేసుకునే దిశగా..
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
యూనిఫాం సివిల్ కోడ్ తో పాటు వక్ఫ్ ఆస్తులపై న్యాయ కమిషన్ తో చట్ట ప్రకారం విచారణ జరిపి అక్రమాలను అరికడతాం అని జేపీ నడ్డా ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా 5 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని అన్నారు. రాష్ట్రంలో వైద్యసదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో పాటు, ముఖ్యమంత్రి అన్నదాత సమ్మాన్ నిధిని ఏర్పాటు చేసి ఏడాదికి రూ. 3000 అందిస్తామని.. దీంతో 10 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.
Read Also: Munugode By Election Results: బీజేపీ, టీఆర్ఎస్ ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన సీఈవో వికాస్
రాష్ట్రంలో దశల వారీగా 8 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం ‘శక్తి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు.. మతపరమైన ప్రదేశాలు, దేవాలయాల చుట్టూ మౌళిక సదుపాయాలను, రవాణా సదుపాయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. దీనికి రూ. 12,000 కోట్లు ఖర్చు చేస్తామని.. హిమ్ తీర్థ్ సర్క్యూట్ తో కనెక్ట్ చేస్తానమి నడ్డా తెలిపారు. రాష్ట్రంలో యాపిల్ ప్యాక్ చేసేందుకు ఉపయోగించే మెటీరియల్ పై విధించే 12 శాతం జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేష్ కశ్యప్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో నవంబర్ 12న పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నారు. ఒకే విడతలో ఈ ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!