BJP Manifesto: అధికారంలోకి వస్తే యూనిఫాం సివిల్ కోడ్ తెస్తాం.. వక్ఫ్ భూములపై విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Promises Uniform Civil Code In Himachal If Voted Back To Power: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ఆదివారం రోజున పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ మేనిఫేస్టోను విడుదల చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో మళ్లీ అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడుతామనే విషయాలను మేనిఫేస్టోలో వివరించారు. 11 హామీలను ఇచ్చారు. ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేస్తామని ప్రకటించారు.
Read Also: By elections: నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యం.. 4 స్థానాలు కైవసం చేసుకునే దిశగా..
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
యూనిఫాం సివిల్ కోడ్ తో పాటు వక్ఫ్ ఆస్తులపై న్యాయ కమిషన్ తో చట్ట ప్రకారం విచారణ జరిపి అక్రమాలను అరికడతాం అని జేపీ నడ్డా ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా 5 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని అన్నారు. రాష్ట్రంలో వైద్యసదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో పాటు, ముఖ్యమంత్రి అన్నదాత సమ్మాన్ నిధిని ఏర్పాటు చేసి ఏడాదికి రూ. 3000 అందిస్తామని.. దీంతో 10 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.
Read Also: Munugode By Election Results: బీజేపీ, టీఆర్ఎస్ ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన సీఈవో వికాస్
రాష్ట్రంలో దశల వారీగా 8 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం ‘శక్తి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు.. మతపరమైన ప్రదేశాలు, దేవాలయాల చుట్టూ మౌళిక సదుపాయాలను, రవాణా సదుపాయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. దీనికి రూ. 12,000 కోట్లు ఖర్చు చేస్తామని.. హిమ్ తీర్థ్ సర్క్యూట్ తో కనెక్ట్ చేస్తానమి నడ్డా తెలిపారు. రాష్ట్రంలో యాపిల్ ప్యాక్ చేసేందుకు ఉపయోగించే మెటీరియల్ పై విధించే 12 శాతం జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేష్ కశ్యప్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో నవంబర్ 12న పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నారు. ఒకే విడతలో ఈ ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!