Riyan Parag Hails Archer and Deshpande: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్పై సాధించిన ఉత్కంఠ భరిత విజయంపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు. మ్యాచ్ ఒక దశలో తమ చేతిలో నుంచి జారిపోతుందని అనిపించిందని, కానీ చివరి ఓవర్లలో బౌలర్లు అద్భుతంగా రాణించడంతో విజయం సాధించగలిగామని తెలిపాడు. అంతా అయిపోయిందనుకున్న సమయంలో జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండేలు దేవుడిలా వచ్చి కాపాడారని పరాగ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో బౌలర్లే హీరోలు అని రాయల్స్…
IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్లో ‘రాయల్’ విజయం కోసం రాజస్థాన్ రాయల్స్ (RR) సిద్ధమైంది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి, రెండోసారి ట్రోఫీని ముద్దాడాలనే కసితో ఉన్న RR జట్టు .. మార్చి 30న తన తొలి మ్యాచ్ ఆడనుంది. గౌహతి వేదికగా జరగనున్న ఈ హై-వోల్టేజ్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో తలపడనుంది. ఈసారి రాజస్థాన్ రాయల్స్ అభిమానులకు డబుల్ ధమాకా కలగనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్లో కొన్ని మార్పులు…
England playing XI vs India for the 5th Test: ఇటీవల కాలంలో టెస్ట్ మ్యాచ్కు ఓ రోజు ముందుగానే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తుది జట్టును ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో కూడా ఇదే విధానాన్ని పాటిస్తోంది. ఈ క్రమంలో భారత్తో ఐదో టెస్టుకు ఒక రోజు ముందుగానే ఈసీబీ ప్లేయింగ్ 11ను ప్రకటించింది. భుజం గాయం కారణంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు. లండన్లోని…
లార్డ్స్ టెస్ట్ విజయంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంతోషం వ్యక్తం చేశాడు. పేసర్ జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన బౌలింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడన్నాడని ప్రశంసించాడు. చివరి రోజు ఉదయం ఆర్చర్ ఎదో మాయ చేస్తాడని తాను అనుకున్నా అని, అనుకున్నట్లే రెండు వికెట్స్ పడగొట్టి మ్యాచ్ను మలుపు తిప్పాడని పేర్కొన్నాడు. భారత్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ డేంజరస్ బ్యాటర్ అని, రెండు ఇన్నింగ్స్ల్లో అతడిని త్వరగా ఔట్ చేయడంతోనే విజయం సాధించామని…
IND vs ENG 3rd Test Playing 11: ఆండర్సన్-టెండ్యూలర్ ట్రోఫీలో భాగంగా మరికొద్ది సేపట్లో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తుది జట్టులోకి వచ్చాడు. జోష్ టంగ్ స్థానంలో ఆర్చర్ ఆడనున్నాడు. ఒక్క మార్పు మినహా రెండో టెస్టులో ఆడిన జట్టునే ఇంగ్లండ్ కొనసాగించింది.…
ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జులై 10 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. లండన్లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదనంలో గురువారం మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ఆరంభం అవుతుంది. మొదటి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్టులో భారత్ గెలిచింది. అండర్సన్-టెండ్యూలర్ ట్రోఫీలో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మూడో టెస్టులో గెలిచి సిరీస్లో ఆధిక్యం సాధించాలని ఇంగ్లండ్, భారత్ టీమ్స్ చూస్తున్నాయి. రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్లు పరుగుల వరద పారించడంతో.. మూడో మ్యాచ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నేడు రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రాజస్థాన్ జట్టు నుంచి సంజు శాంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్లో ఆడటం లేదు. అతని స్థానంలో రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కాగా.. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల…
ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ఉప్పల్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ 44 పరుగుల తేడాతో ఓడింది. రాయల్స్ ఓటమికి బౌలర్లే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి బౌలర్ కూడా 10కి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అయితే ఏకంగా 19 ఎకానమీతో రన్స్ ఇచ్చాడు. తన 4 ఓవర్ల కోటాలో 76 రన్స్ ఇచ్చిన ఆర్చర్.. ఒక్క…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసుకుంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ 44 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ టీం అద్భుత ప్రదర్శన కనబరిచింది. కాగా.. సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్పై 286 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోరు. ఐపీఎల్లో అత్యధిక స్కోరు కూడా…
ఐపీఎల్ 2025 కోసం వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించబడుతుంది. ఈసారి మెగా వేలం జరగనుండడంతో రెండు రోజుల పాటు జరగనుంది. నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. ఈ వేలంలో 574 మంది ఆటగాళ్లలో కేవలం 204 మందిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. బిడ్లో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. చాలా మంది దిగ్గజ ఆటగాళ్ల పేర్లు ఈ జాబితాలో లేవు.