జార్ఖండ్లోని రాంచీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇక్కడ డబ్బు కోసం తల్లిదండ్రులు తమ కుమారుడిని హత్య చేశారు. విషయం ఠాకూర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్రాటు గ్రామంలో చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి ఇక్కడ ఓ యువకుడిని అతని తండ్రి, సవతి తల్లి కలిసి చంపేశారు.
మహారాష్ట్ర, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తారు. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో అయితే సినీ, రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేశారు.
జార్ఖండ్లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ బూత్లకు తరలివచ్చారు.
మహారాష్ట్ర, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నడుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు మహారాష్ట్రలో 45 శాతం, జార్ఖండ్లో 61 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
మహారాష్ట్ర, జార్ఖండ్లో అసెంబ్లీ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ బూత్లకు తరలివస్తున్నారు. ఇక ముంబైలో సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు వేసేందుకు తరలివచ్చారు.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మలబార్ హిల్లో సంపన్నులు ఓటేయరని గోయెంకా వ్యంగ్యాస్త్రాలు సంధింస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్టు వైరల్గా మారింది. ఆ పోస్టులో.. మలబార్ హిల్లో సంపన్నులు పోలింగ్ కేంద్రానికి మెర్సిడెస్ బెంజ్లో వెళ్లాలా? లేదంటే బీఎండబ్ల్యూ కారులో వెళ్లాలా అని చర్చిస్తూ కూర్చుంటారని ఎద్దేవా చేశారు.
మహారాష్ట్ర, జార్ఖండ్లో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు తీసుకుని పోలింగ్ బూత్లకు తరలి వెళ్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక హెలికాప్టర్లలో సిబ్బందిని తరలిస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు.
Election Campaign: నేటితో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 20వ తేదీన ఒకే విడతలో మహారాష్ట్రలోని 288 స్థానాలకు.. జార్ఖండ్ లో సెకండ్ విడత పోలింగ్ జరగనుంది.
బీజేపీకి ఝార్ఖండ్ ప్రజలపై ప్రేమ లేదు.. ఇక్కడి ఖనిజ సంపదపై కన్ను వేసిందని స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన జార్ఖండ్ రాష్ట్రం బొకారో నియోజకవర్గంలోని శివండి, దుంది బజార్, ఆజాద్ నగర్ తదితర బ్లాక్లల్లో ఇండియా కూటమి పక్షాన ప్రచారం నిర్వహించారు.