జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి మూడో విడత వారాహి యాత్రను స్టార్ట్ చేయనున్నారు. అయితే, విశాఖ ఎయిర్ పోర్ట్ లోపల హై సెక్యురిటీ ఏర్పాటు చేశారు. ఎరివల్ పాయింట్ ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటి ఫోర్స్ తమ అధీనంలోకి తీసుకుంది. బారి కేడ్లు, రోప్ పార్టీలను పోలీసులు ఏర్పాటు చేసింది.
విశాఖలో రేపటి నుంచి జనసేనాని పవన్కళ్యాణ్ చేపడతున్న వారాహియాత్రపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. మూడో విడత వారాహి యాత్రకు పోలీసులు పలు నిబంధనలు విధించారు. కొన్ని షరతులతో యాత్రకు అనుమతులు జారీ చేశారు.
వారాహి యాత్రకు వస్తున్న పవన్ కళ్యాణ్పై మంత్రి అమర్నాథ్ ప్రశ్నల వర్షం కురిపించారు. వారాహి వెబ్ సిరీస్ 3 అంటూ వ్యాఖ్యానించారు మంత్రి. ఉత్తరాంధ్రలో అక్రమాలు అన్యాయాలపై ప్రశ్నిస్తానంటున్న ప్యాకేజ్ స్టార్ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అమర్నాథ్.
పశ్చిమ గోదావరి జిల్లాలో పంచారామాల్లో ఒకటైన భీమవరం శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకుడిపై ఓ వ్యక్తి దాడికి తెగబడిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎవరి కళ్లలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి యజ్ఞోపవీతాన్ని తెంచారని ఆయన ప్రశ్నించారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అనంతరం వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మల్లవల్లి రైతుల్లో ప్రతి ఒక్కరికీ పరిహారం అందేవరకు జనసేన అండగా ఉండి పోరాటం చేస్తుందని తెలిపారు.
టీడీపీ పెత్తందార్ల వైపు.. మేము పేదల వైపు ఉన్నామని ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ళు ఇస్తామంటే మోకాలడ్డి చంద్రబాబు శునకానందం పొందుతున్నాడు. అమరావతి మీ అడ్డా కాదు.. మా బిడ్డలు ఉంటారు.. ఈ యుద్ధంలో మేం కచ్చితంగా గెలిచి తీరుతామని ఆయన పేర్కొన్నారు.
రౌడీయిజం చేయగలిగినవాడే రాజకీయ నాయకుడు అనుకోవాలా? అని ఆయన అన్నారు. కరడుగట్టిన చట్టాలున్న దేశంల్లో బతకొచ్చు.. ఇక్కడ మాత్రం బతకలేని పరిస్థితులు కల్పించారు. రాష్ట్రంలో కౌన్సిలర్ కూడా బెదిరించేస్తాడు.. అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అని పవన్ కల్యాణ్ అన్నారు.