Pawan Kalyan: రుషికొండలో టెన్షన్ టెన్షన్.. కాసేపట్లో విజిట్కు పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో మూడవ విడత వారాహి యాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా.. నేడు రుషికొండను విజిట్ చేయనున్నారు. అయితే పవన్ సందర్శన సందర్భంగా.. రుషికొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు పోలీసుల ఆంక్షలు దాటకుని ఋషికొండ వెళ్లి తీరతామని జనసేన నేతలు అంటున్నారు. నిషేధిత ప్రాంతం కానప్పుడు ఎందుకు అడ్డుకుంటారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
Indian Railways: అలా చేస్తే.. రైల్వేకు రోజుకు రెండు లక్షల లీటర్ల డీజిల్ ఆదా
Also Read
- Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
నోవాటల్ హోటల్ నుండి ఋషికొండకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయల్దేరి వెళ్లారు. ఆయన పర్యటన దృష్ట్యా.. రుషికొండకు వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు జోడిగుళ్లపాలెం, సాగర్ నగర్, ఋషికొండ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. ఋషికొండకు వెళ్లే మార్గాలు పోలీసులు మూసివేశారు. రుషికొండ పర్యటనకు అనుమతి లేకపోవడంతో ఎక్కడికక్కడ నియంత్రణ కోసం పోలీసులు సన్నద్ధం అయ్యారు. దీంతో రుషికొండ మొత్తం హైసెక్యూరిటీ జోన్ గా మారింది. మరోవైపు ఆంక్షలను ఉల్లంఘించయిన రుషికొండ వెళతామని జనసేన అంటోంది. ఆ ప్రాంతం నిషేధిత ప్రాతం కానందున ఆంక్షలు ఎందుకో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే జనసేన నాయకులతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. వాహనాల సంఖ్య పరిమితంగా ఉండాలని సూచిస్తున్నారు.
China Real Estate: చైనాలో ద్రవ్యోల్బణం.. 6 నెలల్లో ఒక్క సంస్థ రూ. 57వేల కోట్ల నష్టం
మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ కు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా నిన్న జరిగిన సభలో పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు దాఖలు చేశారు. దీంతో విశాఖ తూర్పు ఏసీపీ పవన్ కల్యాణ్ కు నోటీసులు అందించారు. బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని.. పవన్ ఇలా వ్యవహరించి ఉండకూడదని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. జనసేనకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై ఆ పార్టీ స్పందించింది. ఎన్ని ఆంక్షలు పెట్టిన వారాహి యాత్రలో వెనక్కి తగ్గబోమని అంటోంది.
తాజావార్తలు
-
Tollywood : సమ్మర్ అంటే భయపడిపోతున్న స్టార్స్
-
CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
-
Krishnavataram Part 1: కృష్ణావతారం మూవీ టికెట్ల ధరపై.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు!
-
VeeraBhadrudu : వీరభద్రుడు వచ్చేశాడు.. ట్రైలర్ లో అదరగొట్టిన సూర్య
-
Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?