జనసేన అధినేత పవన్ కల్యాణ్పై దర్శకనిర్మాత, రచయిత, సినీ నటుడు పోసాని మురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.. పోసాని వ్యాఖ్యలను జీర్ణించుకోలేని కొందరు పవన్ అభిమానులు.. పోసానిపై దాడికి కూడా యత్నించారు.. పీఎస్లో కూడా ఫిర్యాదు చేశారు. ఇక, తాజాగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషించారని సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్ ప్రసంగంలో పిచ్చి, ఉన్మాదం పరాకాష్టకు చేరిందనిపిస్తోందని.. కానీ, రాష్ట్రాభివృద్ధికి ఒక్క సలహా ఇచ్చింది లేదన్నారు. ఇంత దిగజారి సంస్కార హీనంగా ఏ పార్టీ అధ్యక్షుడు కూడా మాట్లాడలేదన్న ఆయన.. ఒక విజన్ లేకుండా… నాకేదో వ్యూహం ఉంది అని గొప్పగా చెప్పుకోడానికి ప్రయత్నం చేశారని సెటైర్లు వేశారు.…
జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలు కామెంట్లు చేయడం.. దానికి ఏపీ మంత్రులు కౌంటర్ ఇవ్వడం.. మధ్యలో పోసాని మురళి ఫైర్ అవ్వడం.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం.. ఇలా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ పెరిగింది.. ఇటు సినిమా పరిశ్రమలో కొంత టెన్షన్ నెలకొంటే.. పొలిటికల్ కామెంట్లు మాత్రం ఓ రేంజ్లో పేలుతున్నాయి.. అయితే, పవన్ కల్యాణ్.. మంత్రిని.. ఆ మంత్రి తిరిగి పవన్ని దూషించడం అంతా ఒక గేమ్ అని వ్యాఖ్యానించారు మాజీ ఎంపీ…
జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ టార్గెట్ గా పవన్ కళ్యాణ్ మరోసారి రెచ్చిపోయి ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిసారి, నా వ్యక్తిగత జీవితంపైనే విమర్శలు చేస్తున్నారని.. సమాధానాలు చెప్పడం వైసీపీ నాయకులకు రాదని.. వైసీపీ వాళ్లు మాట్లాడ్డం ఎప్పుడు నేర్చుకుంటారు..? అరవడం తప్ప..’ అంటూ పవన్ వైసీపీ నాయకులపై కామెంట్స్ చేశారు. ‘వివేకా హత్య కేసుపై అడిగితే.. నా వ్యక్తిగతం గూర్చి మాట్లాడుతున్నారు.…
జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ మాట్లాడుతూ.. ‘సినిమాలంటే నాకు ఇష్టం.. నాకు సినిమా అన్నం పెట్టిన తల్లి.. సినిమా పరిశ్రమను తక్కువ చేయడం లేదు.. కానీ, రాజకీయాల్లోకి నచ్చి వచ్చా.. నేను సినిమా హీరోను కాదు.. నేను నటుడిని కావాలని కూడా కోరుకోలేదు.. కానీ, సాటి మనిషికి అన్యాయం జరిగితే.. స్పందించే గుణం నాలో ఉంది.. మీకు యుద్ధం ఎలా కావాలో చెప్పండి.. ప్రజాస్వామ్య…
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ మీటింగ్ ను నేడు నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘వైసీపీ గ్రామసింహాలు అంటూ ప్రసంగం పవన్ ప్రసంగం ప్రారంభించారు. గ్రామసింహాలంటే.. కొన్ని నిఘంటువుల ప్రకారం.. ఎక్కువ వాగి పళ్లు రాలగొట్టించుకొనే కుక్కలు అంటూ పవన్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలకు భయం అంటే నేర్పిస్తా.. కులాల చాటున దాక్కుంటే లాకొచ్చి కొడతా.. గుంటూరు బాపట్లలో పుట్టినవాడిని నాకు బూతులు రావా..? రాజకీయాల్లో…
బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడంతో.. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్నాయి.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం కాగా.. మరోసారి విజయంపై కన్నేసిన వైసీపీ.. బద్వేల్ అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధా పేరును ఖరారు చేయగా.. మరోవైపు.. పరిషత్ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం పరిధిలో వచ్చిన ఓట్లను బట్టి.. గట్టి పోటీ ఇవ్వగలమనే ధీమాతో.. బై పోల్పై ప్రత్యేకంగా…
సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయం విషయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.. ఈ నేపథ్యంలో పవన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… జనసేనానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఒళ్లంతా బురద చల్లుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. తమ పాలిట గుదిబండ అయ్యారని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ పవన్ కల్యాణ్ గురించి…