ఏపీలో జనసేన పార్టీ దూకుడు పెంచింది. బలం పెంచుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. అక్టోబర్ 2 వ తేదీన రాష్ట్రంలో చేపట్టిన శ్రమదానం కార్యక్రమం విజయవంతం కావడంతో బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తోందని, అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. ఇప్పటి వరకు జనసేన పార్టీ ఎలాంటి వలసలను ప్రోత్సహించలేదు. కాగా, ఇప్పుడు ఆ పార్టీలోకి వలసలు ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.…
ప. గో జిల్లా : జనసేన పార్టీతో పొత్తుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2024 లో జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని… ఎలాంటి అనుమానాలు ఇందులో లేవన్నారు. జనసేన కి ఒక పాలసీ ఉంది.. తమకు ఒక పాలసీ ఉందని చెప్పారు. బిజెపి కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించదు….అందుకే బద్వేల్ లో పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు. భిన్న అభిప్రాయాలు సాధారణం… జనసేన తో మిత్ర పక్షం గా కొనసాగుతామని…
పవన్ కళ్యాణ్ ఈరోజు రాజమండ్రిలో జరిగిన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాలంటే సరదా కాదని, ఒక బాధ్యతగా తీసుకున్నానని చెప్పారు. అందరిని కలుపుకొని పోవాల్సిన అవనసం ఉందని అన్నారు పవన్. కమ్మలకు వ్యతిరేకం కాదని చెప్పేందుకే తాను 2014లో టీడీపికి మద్ధతు ఇచ్చానని, అయితే, ఇప్పుడు టీడీపీ సత్తా సరిపోవడం లేదని, అందుకే తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని పవన్ పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలను కూడా వైసీపీ నేతలు వదలడంలేదని అన్నారు. యుద్ధం చేయాల్సిన…
గాంధీ జయంతి రోజున జనసేన పార్టీ రాజమండ్రిలో శ్రమదానం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. శ్రమదానం కార్యక్రమం తరువాత భారీ మహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే, ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు కల్పించడంతో సభను రాజమండ్రిలోని వేరే ప్రాంతంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ప్రజల హక్కులను ఏ ప్రభుత్వం ఆపలేదని, నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కుగా పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులను కాల రాయొద్దని అన్నారు. రాజకీయం అనేది…
రోడ్ల మరమ్మతుల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన శ్రమదానం కార్యక్రమం సెటైర్లు వేశారు ఏపీ మంత్రి శంకర్ నారాయణ.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్పై మండిపడ్డారు.. పవన్ది ప్రశ్నించే పార్టీ కాదు.. ప్యాకేజీ తీసుకునే పార్టీ అని ఎద్దేవా చేసిన ఆయన.. జాతీయ రహదారిపై మాట్లాడక పోవడం విడ్డూరం.. రాష్ట్ర రహదారులపై మాట్లాడడం ఏంటి? అని ప్రశ్నించారు. వర్షాలు ఆగిన వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపడతామన్న ఆయన.. ఉనికి కోసం…
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోన్న జనసేన.. ఇవాళ శ్రమదానానికి పిలుపునిచ్చింది.. ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు జనసేన చీఫ్.. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. అసలు, పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ కోసం ఆంధ్ర వచ్చినప్పుడు రాజకీయాలు గుర్తుకువస్తాయంటూ ఎద్దేవా చేశారు.. గతంలో…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటనకు ఎలాంటి అడ్డంకులు లేవని చెబుతూనే.. ఏకంగా పవన్ కాన్వాయ్ని అడ్డుకున్నారు పోలీసులు.. రాజమండ్రి క్వారీ సెంటర్కు పవన్ కల్యాణ్ కాన్వాయ్ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు.. పవన్ కాన్వాయ్ ను అడ్డుకోవద్దు అంటూ పోలీసులతో జనసైనికులు వాగ్వాదానికి దిగారు.. దీంతో, కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేనాని పవన్.. తన కారు టాప్పై కూర్చొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఆ తర్వాత…
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు బహిరంగ సవాల్ విసిరారు ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్కు దుమ్ముంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి గెలవాలని సవాల్ చేశారు.. తెలుగుదేశం పార్టీ తో కుమ్మక్కై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని సూచంచిన ఆయన.. 38 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకే ఒంటరిగా పోటి చేసే దమ్ము లేదు.. ఇక, జనసేన పార్టీ ఎంత? ఎన్నికల్లో పొత్తు లేకుండా ఎప్పుడైనా…