దావోస్ పర్యటనలో ఏపీ సీఎం జగన్ స్టైలిష్ లుక్లో అదరగొట్టారు. సీఎం అయిన తర్వాత ఎక్కువగా తెల్ల రంగు షర్టుల్లో మాత్రమే కనిపించే జగన్ తన తొలి విదేశీ పర్యటనలో క్యాజువల్ షర్ట్స్, జీన్స్ ప్యాంట్లతో కనిపించారు. ఓ ఎయిర్పోర్టులో సీఎం జగన్ ఇలా దర్శనమిచ్చారు. దీంతో జగన్ చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మరోవైపు దావోస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో చర్చించేటప్పుడు సీఎం జగన్ బ్లేజర్ కోట్ ధరించారు. కాగా దావోస్లోని…
ఏపీ సీఎం జగన్ దావోస్ టూర్లో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీలు అవుతున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్తో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీ ఛైర్మన్ ఆదిత్య మిట్టల్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు విశాఖలోని తన ప్లాంట్ విస్తరణ నిమిత్తం రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆదిత్య మిట్టల్ అంగీకరించారు. అంతేకాకుండా కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిధిలో ఇటీవల గ్రీన్ కో నేతృత్వంలో ఏర్పాటైన ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యువబుల్…
దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ప్రభుత్వం పలు కంపెనీలతో కీలక పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ మేరకు జగన్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఎంవోయూలను కుదుర్చుకుంటున్నారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ కోసం భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. ఈ మేరకు రూ.60 వేల కోట్లు భారీ పెట్టుబడి పెట్టడానికి అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ముందుకు వచ్చింది. Jagan Davos Tour: టెక్ మహింద్రాతో ఏపీ ప్రభుత్వం…
సీఎం జగన్ దావోస్ పర్యటనలో రెండో రోజు బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో జగన్ సమావేశమై కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టాలని జగన్ రిక్వెస్ట్ చేయగా.. గుర్నాని సానుకూలంగా స్పందించారు. టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ బైట్.#APatWEF22 #AndhraPradesh #CMYSJaganInDavos pic.twitter.com/zv8F17pB8l — YSR Congress Party (@YSRCParty) May 23, 2022…
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు సీఎం జగన్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. తొలిరోజు పలువురు పారిశ్రామిక వేత్తలతో జగన్ సమావేశమై ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. తొలుత ఈ సదస్సులో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేశారు. ఏపీ పెవిలియన్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను జగన్ పరిశీలించారు. అనంతరం డబ్ల్యూఈఎఫ్ హెల్త్ విభాగం అధిపతి శ్యాం…
దావోస్ నేటి నుంచి ఈ నెల 26 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యాఈఎఫ్ సదస్సు జరుగునుంది. అయితే సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం దావోస్కు సీఎం జగన్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో దావోస్కు వెళ్లిన జగన్కు.. జ్యూరిక్ ఎయిర్పోర్టులో స్విట్జర్లాండ్లో ఉంటున్న తెలుగు ప్రజలు, రాష్ట్ర అధికారులు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, సీఎం…
ఏపీ సీఎం జగన్ శనివారం రాత్రి దావోస్ చేరుకున్నారు. ఆయన వెంట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు. రేపు డబ్ల్యూఈఎఫ్తో జగన్ కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ సదస్సు తొలిరోజు పలువురితో జగన్ సమావేశం కానున్నారు. డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో ఏపీ రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడనుంది. నూతన…