సన్నీ డియోల్ హీరోగా నటించిన “జాట్” సినిమా రేపు బాలీవుడ్లో రిలీజ్ కాబోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. మరికొద్ది సేపట్లో ముంబైలో ప్రీమియర్స్ ప్రదర్శించబోతుండగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డు ఏకంగా 22 సీన్స్ మార్చమని కోరినట్లు వెల్లడైంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సుమారు 22 సీన్లు…