Indiramma Indlu : తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల పట్ల ప్రత్యేక దృష్టితో పథకాలు అమలవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు, పేదలు నివసించే ప్రాంతాల్లో జీవనోపాధికి ఆటంకం లేకుండా జీ+3 మోడల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ఆదివాసీలకు నివాస హక్కు కల్పించడమే కాకుండా, వారు జీవించేందుకు అవసరమైన వనరులను అందుబాటులో ఉంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇక పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు పథకం కార్యరూపం దాల్చనుంది. REDMAGIC 10S…
Minister Seethakka : ఇంద్రవెల్లి సంఘటన జ్ఞాపకార్థం నిర్వహించిన సభలో ఆదివాసుల హక్కుల కోసం మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. “అనాటి ఘటన దురదృష్టకరమైనది. అది ఎవరి వైపు నుంచైనా తప్పుగా జరిగి ఉండొచ్చు, కానీ బాధ్యతను మేమే తీసుకుంటాం” అంటూ ఆమె పేర్కొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, అప్పట్లో రెవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇంద్రవెల్లి అమరవీరుల జ్ఞాపకార్థం స్మృతివనం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. “అప్పుడు నివాళులర్పించడానికి కూడా అనుమతి ఇవ్వలేదు.…
Tummala Nageswara Rao : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పూసుకుంట, కటుకూరు గ్రామాలలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ, చేనేత అనుబంధ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఆయన ఈ సందర్బంగా ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితిష్ వి పాటిల్, ఐటిడి పిఓ రాహుల్ తో కలిసి పూసుకుంట నుండి రాచన్నగూడెం బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. శనివారం పూసుకుంటకు చేరుకున్న…
రెండేళ్ల నిరీక్షణకు ముగింపు పలికి, ఎట్టకేలకు ఒక ప్రైవేట్ సంస్థ రూపొందించిన సవివర ప్రాజెక్టు నివేదికను సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)-ఉట్నూర్కు సమర్పించింది. కుంటాల జలపాతాలు, ఉట్నూర్ మండలంలోని చారిత్రాత్మక గిరిజన కోట, పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మిట్టే, సప్తగుండాల జలపాతాల వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఈ నివేదికను సమర్పించారు. పనుల అంచనా వ్యయం రూ.9 కోట్లు కాగా, ఈ ప్రదేశాలు రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా దేశంలోని ఇతర…
విశాఖ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.వి.ఎస్.ఎన్.కుమార్ పై దాడులు చేశారు ఏసీబీ అధికారులు. ఆయన్ని అరెస్ట్ చేశారు. పాడేరు ఐటీడీఏ లో ఇఇ గా పని చేస్తున్నారు కె.వి.ఎస్.ఎన్.కుమార్. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఫిర్యాదు రావడంతో నిన్న ఎనిమిది చోట్ల సోదాలు చేశారు. ప్రభుత్వ విలువ ప్రకారం రెండు కోట్ల అరవై లక్షల విలువ చేసే ఆస్తులు స్వాధీనం…
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి మత్తు వేధిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే వుంది. విశాఖ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో గంజాయి సాగు, రవాణా అరికట్టే పనిలో నిమగ్నం అయ్యారు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నిర్మూలించే పనిలో బిజీ అయ్యారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ప్రభుత్వ శాఖల సమన్వయంతో…
ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాల గిరిజనులు ఎమ్మెల్యే రాజన్నదొరను కలిశారు. కొఠియా గ్రూపు గ్రామాలలో తెలుగు బోర్డులు ఏర్పాటు చేస్తుండగా ఒడిశా అధికారులు అడ్డుకుని తమపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఒడిశాతో ఉండకపోతే కేసులు పెట్టి జైలుపాలు చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ధన మాన ప్రాణరక్షణకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను వారు కోరారు. అలాగే ఐటిడిఎ పిఓ , జిల్లా కలెక్టర్లకు కూడా ఫిర్యాదు చేస్తామని గిరిజనులు తెలిపారు. కొఠియా సమస్యపై చీఫ్…