చంద్రయాన్-3 విజయవంతంపై యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అభినందనలు తెలిపారు. భారత్ చరిత్రను సృష్టిస్తూనే ఉందని X (ట్విట్టర్) లో తెలిపారు.
ఈరోజు చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న ప్రపంచంలోనే మొదటి దేశంగా భారతదేశం అవతరించిందని.. ఇస్రో శాస్త్రవేత్తల జీతం అభివృద్ధి చెందిన దేశాల కంటే ఐదు రెట్లు తక్కువగా ఉన్నందున ఈ ఘనత సాధించామని ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ పేర్కొన్నారు.
జాబిల్లిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అయిన సంగతి అందరికి తెలిసిందే. చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపై విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్కు ముందు అనేక అసమానతలను అధిగమించి భారతదేశాన్ని ఎలైట్ స్పేస్ క్లబ్లో చేర్చింది.
భారతదేశం బుధవారం చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర రోవర్ను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా అవతరించింది. ఈ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు.
చంద్రయాన్-3 విజయవంతం కావడంతో భారతదేశంలోని కోట్లాది మంది భారతీయులు సంబురాలు జరుపుకున్నారు. దేశంలోని ప్రజలే కాకుండా.. ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంబురాలు నిర్వహించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది. జాబిల్లి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా దిగింది. బుధవారం అంటే ఆగస్టు 23 భారతదేశానికి, ప్రపంచానికి చారిత్రాత్మకమైన రోజు. ల్యాండ్ అయిన రెండు గంటల 26 నిమిషాల తర్వాత రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండర్ 'విక్రమ్' నుంచి బయటకు వచ్చింది.
జాబిల్లి దక్షిణ ధ్రువంపై తొలిసారిగా అడుగుపెట్టిన భారత్పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రయాన్ 3 విజయం పట్ల భారత సంతతి ప్రజలతో పాటు యావత్ ప్రపంచం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇతర దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు సైతం ఇస్రోకు అభినందనలు తెలిపాయి.
చంద్రుడి మీద విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత చంద్రయాన్-3 తొలి చిత్రాన్ని విడుదల చేసింది. ల్యాండ్ అయిన తర్వాత విక్రమ్ తీసిన ఫొటోలు ఇవి. ల్యాండర్ పంపిన నాలుగు ఫొటోలను ఇస్రో పంచుకుంది. తద్వారా బెంగళూరు రీసెర్చ్ సెంటర్తో ల్యాండర్ కమ్యూనికేషన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
చంద్రుడిని చేరుకోవడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత ప్రధాని మోడీ ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్తో ఫోన్లో మాట్లాడారు. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా నుంచి ఇస్రో చీఫ్కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.