Dalai Lama: చంద్రయాన్-3 ల్యాండింగ్పై ప్రధాని మోడీ, ఇస్రోను అభినందించిన దలైలామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dalai Lama: భారతదేశం బుధవారం చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర రోవర్ను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా అవతరించింది. ఈ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు. చంద్రయాన్-3 విజయవంతమైనందుకు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభినందించారు. విక్రమ్ ల్యాండర్ను విజయవంతంగా ల్యాండింగ్ చేసి శాస్త్రీయ అభివృద్ధికి కృషి చేసిన భారత శాస్త్రజ్ఞులకు ఆయన అభినందనలు తెలిపారు.
Read Also: ISRO EX Chairman: ఇస్రో శాస్త్రవేత్తల జీతంపై మాజీ ఛైర్మన్ ఏమన్నారంటే..!
Also Read
- Mahindra XEV 9S: 679 కిలోమీటర్ల రేంజ్, 20 లక్షల లోపు ధర.. బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ ఫేవరెట్ కారు..
- Ridge Gourd Peel Besan Curry Recipe: బీరకాయ తొక్కలను పారేయకండి.. ఈ సూపర్ కర్రీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ వదలరు...
- Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
- Petrol Diesel Prices: పాకిస్థాన్లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్లో పోలిస్తే ఎంతంటే..?
ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్, ఏజెన్సీలోని శాస్త్రవేత్తల బృందాన్ని కూడా ప్రశంసించారు, భారతదేశం శాస్త్రీయ, సాంకేతిక పరిపక్వతను ప్రదర్శించే లక్ష్యంతో ఈ మిషన్లో పనిచేశారని కొనియాడారు. “మిషన్ను సాధ్యం చేసిన వారి అంకితభావానికి ఇస్రో అధిపతి, అతని బృందాన్ని నేను అభినందిస్తున్నాను. వారు భారతదేశ శాస్త్రీయ, సాంకేతిక పరిపక్వతను ప్రదర్శించారు” అని ఆధ్యాత్మిక నాయకుడు చెప్పినట్లు ప్రకటన పేర్కొంది. “భారతదేశంలో ఎక్కువ కాలం గడిపిన అతిథిగా, ఈ గొప్ప విజయానికి నేను సంతోషిస్తున్నాను. భారత వైజ్ఞానిక పరిశోధనా సంస్థ తదుపరి శాస్త్రీయ ప్రయత్నాలలో తన నాయకత్వ పాత్రను బలోపేతం చేయడానికి కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను.” అని దలైలామా అన్నారు. ప్రార్థనలు, శుభాకాంక్షలతో ఆయన తన సందేశాన్ని ముగించారు.
Read Also: Viral Video: మేం ఆల్రెడీ చంద్రుడి మీదే ఉన్నాం.. చంద్రయాన్-3పై పాకిస్థాన్ యువకుడి ఫన్నీ కామెంట్
అంతరిక్షంలోకి 40 రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాన్-3 ల్యాండర్ ‘విక్రమ్’ బుధవారం చంద్ర దక్షిణ ధృవాన్ని తాకింది. అలా చేసిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది. యూఎస్, రష్యా, చైనా తర్వాత చంద్రుని ల్యాండింగ్ మిషన్ను విజయవంతంగా నిర్వహించిన నాల్గవ దేశంగా భారతదేశం నిలిచింది. ఈ వ్యోమనౌకను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Mahindra XEV 9S: 679 కిలోమీటర్ల రేంజ్, 20 లక్షల లోపు ధర.. బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ ఫేవరెట్ కారు..
-
Ridge Gourd Peel Besan Curry Recipe: బీరకాయ తొక్కలను పారేయకండి.. ఈ సూపర్ కర్రీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ వదలరు…
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Petrol Diesel Prices: పాకిస్థాన్లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్లో పోలిస్తే ఎంతంటే..?
-
Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత… 400 కోట్ల దిశగా పరుగులు
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!