Dalai Lama: చంద్రయాన్-3 ల్యాండింగ్పై ప్రధాని మోడీ, ఇస్రోను అభినందించిన దలైలామా
Dalai Lama: భారతదేశం బుధవారం చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర రోవర్ను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా అవతరించింది. ఈ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు. చంద్రయాన్-3 విజయవంతమైనందుకు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభినందించారు. విక్రమ్ ల్యాండర్ను విజయవంతంగా ల్యాండింగ్ చేసి శాస్త్రీయ అభివృద్ధికి కృషి చేసిన భారత శాస్త్రజ్ఞులకు ఆయన అభినందనలు తెలిపారు.
Read Also: ISRO EX Chairman: ఇస్రో శాస్త్రవేత్తల జీతంపై మాజీ ఛైర్మన్ ఏమన్నారంటే..!
Also Read
- West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా అవుట్ చేయాలి.. చాట్ జీపీటీ సమాధానం మైండ్ బ్లోయింగ్..
- AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
- Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత - నాగచైతన్య.. అది కూడా పార్ట్నర్స్తో!
ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్, ఏజెన్సీలోని శాస్త్రవేత్తల బృందాన్ని కూడా ప్రశంసించారు, భారతదేశం శాస్త్రీయ, సాంకేతిక పరిపక్వతను ప్రదర్శించే లక్ష్యంతో ఈ మిషన్లో పనిచేశారని కొనియాడారు. “మిషన్ను సాధ్యం చేసిన వారి అంకితభావానికి ఇస్రో అధిపతి, అతని బృందాన్ని నేను అభినందిస్తున్నాను. వారు భారతదేశ శాస్త్రీయ, సాంకేతిక పరిపక్వతను ప్రదర్శించారు” అని ఆధ్యాత్మిక నాయకుడు చెప్పినట్లు ప్రకటన పేర్కొంది. “భారతదేశంలో ఎక్కువ కాలం గడిపిన అతిథిగా, ఈ గొప్ప విజయానికి నేను సంతోషిస్తున్నాను. భారత వైజ్ఞానిక పరిశోధనా సంస్థ తదుపరి శాస్త్రీయ ప్రయత్నాలలో తన నాయకత్వ పాత్రను బలోపేతం చేయడానికి కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను.” అని దలైలామా అన్నారు. ప్రార్థనలు, శుభాకాంక్షలతో ఆయన తన సందేశాన్ని ముగించారు.
Read Also: Viral Video: మేం ఆల్రెడీ చంద్రుడి మీదే ఉన్నాం.. చంద్రయాన్-3పై పాకిస్థాన్ యువకుడి ఫన్నీ కామెంట్
అంతరిక్షంలోకి 40 రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాన్-3 ల్యాండర్ ‘విక్రమ్’ బుధవారం చంద్ర దక్షిణ ధృవాన్ని తాకింది. అలా చేసిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది. యూఎస్, రష్యా, చైనా తర్వాత చంద్రుని ల్యాండింగ్ మిషన్ను విజయవంతంగా నిర్వహించిన నాల్గవ దేశంగా భారతదేశం నిలిచింది. ఈ వ్యోమనౌకను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Rajasthan Royals Owner: రాజస్థాన్ రాయల్స్ కొత్త ఓనర్గా బిలియనీర్ లక్ష్మీ మిట్టల్.. రూ.15,660 కోట్లతో డీల్!
-
Sundar C: రజనీ, కమల్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా.. డైరెక్టర్ సుందర్ సి సంచలన వ్యాఖ్యలు!
-
Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి
-
Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
-
West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!