Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Discover Technology To Detect Ragging West Bengal Governors Letter To Isro

West Bengal Governor: ర్యాగింగ్‌ను గుర్తించే సాంకేతికతను కనుగొనండి.. ఇస్రోకి పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ లేఖ

Published Date :August 25, 2023 , 2:35 pm
By Naga Maneendra
West Bengal Governor: ర్యాగింగ్‌ను గుర్తించే సాంకేతికతను కనుగొనండి.. ఇస్రోకి పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ లేఖ
  • Follow Us :
  • google news
  • dailyhunt

West Bengal Governor: ర్యాగింగ్‌ నియంత్రణకు ఎంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ నియంత్రణ కావడం లేదు. దేశంలోని ఏదో ఒక విద్యా సంస్థలో ఏదో రూపంలో ర్యాగింగ్‌ భూతం బయటపడుతోంది. ఈ నేపథ్యంలో ర్యాగింగ్‌ను కనుగొనే ఆధునిక సాంకేతికతను కనిపెట్టి.. ర్యాగింగ్‌ బారిని విద్యార్థులను రక్షించేలా చూడాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ కోరారు. ర్యాంగింగ్‌ను అడ్డుకునేందుకు అవసరమైన సాంకేతికతను గుర్తించేందుకు సాయం చేయాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో)కు విజ్ఞప్తి చేశారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌పై నిషేధం ఉన్నప్పటికీ.. కొన్నిచోట్ల ఇది కొనసాగుతూనే ఉంది. ఏటా ఎంతో మంది విద్యార్థులు ర్యాగింగ్‌ రక్కసికి బలైపోతున్నారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండటంలేదు. ఈ క్రమంలోనే ర్యాంగింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన సాంకేతికతను గుర్తించేందుకు సాయం చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద్‌ లేఖ రాసినట్లు రాజ్‌భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also: Secretariat: సచివాలయంలో ప్రార్థనా మందిరాలను ప్రారంభించిన సీఎం.. ఒకే వేదికపై కేసీఆర్, గవర్నర్..

Also Read

  • Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
  • Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
  • PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
  • Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!

కొద్దిరోజుల క్రితం పశ్చిమబెంగాల్‌లోని జాదవ్‌పుర్‌ విశ్వవిద్యాలయం (Jadavpur University)లో స్వప్నదీప్‌ అనే డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు స్వప్నదీప్‌ మృతికి సీనియర్ల వేధింపులే కారణమని తేల్చారు. ఈ మృతిపై యూనివర్శిటీ ఛాన్స్‌లర్ ఆనంద్‌ బోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ర్యాగింగ్‌ను అడ్డుకునేందుకు సాంకేతిక సాయం అందించాలని ఇస్రోను కోరారు. క్యాంపస్‌లలో ర్యాగింగ్‌ను సమర్థవంతంగా నిరోధించడానికి మరియు తొలగించడానికి తగిన సాంకేతికతను గుర్తించడానికి పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి వి ఆనంద బోస్ మరియు విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ను సంప్రదించారు. గవర్నర్‌ బోస్‌ హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్‌ డేటా ప్రాసెసింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ADRIN)తో కూడా చర్చించారు. సాంకేతికత వీడియో అనలిటిక్స్, ఇమేజ్ మ్యాచింగ్, ఆటోమేటిక్ టార్గెట్ రికగ్నిషన్ మరియు రిమోట్ సెన్సింగ్ వంటి బహుళ వనరులను ఉపయోగించాలని భావిస్తున్నారు. జాదవ్‌పూర్ యూనివర్శిటీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి వర్సిటీ హాస్టల్‌లోని బాల్కనీలో నుండి పడి మృతి చెందిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. యూనివర్సిటీ విద్యార్థి మృతికి సంబంధించి మొత్తం 12 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ISRO
  • letter
  • ragging
  • Technology
  • West Bengal Governor

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions