Israel-Gaza Conflict: ఇజ్రాయెల్ – గాజా మధ్య యుద్ధ వాతావరణం.. 5000 రాకెట్ల ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Gaza Conflict: గాజా స్ట్రిప్లోని హమాస్ ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైపు డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించారు. ఇది యుద్ధ పరిస్థితిని సృష్టించింది. ఇజ్రాయెల్పై ఉగ్రవాదులు దాడి చేశారు. దీనిని ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు. హమాస్ ఉగ్రవాదుల దాడిలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ దాడికి హమాస్ బాధ్యత వహించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం కూడా గాజా స్ట్రిప్లో వైమానిక దాడులు చేసింది.
Read Also:Bigg Boss 7 Telugu: ‘తొక్కలో సంచాలక్..బొక్కలో తీర్పు ‘.. అమర్ పరువుతీసిన నాగ్..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
హమాస్ ఉగ్రవాదుల దాడుల దృష్ట్యా ఇజ్రాయెల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో పాటు హమాస్ ఉగ్రవాద సంస్థ ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ హెచ్చరించింది. హమాస్ ఉగ్రవాద సంస్థ గంట క్రితం దాడి చేసిందని ఆయన ట్వీట్ చేశారు. వారు రాకెట్లను ప్రయోగించి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడ్డారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పౌరులకు రక్షణ కల్పిస్తుంది. హమాస్ ఉగ్రవాదులకు గుణపాఠం చెబుతుంది. దాడి తర్వాత ఇజ్రాయెల్లోని అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగించాయి. టెల్ అవీవ్లోని డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్క్వార్టర్స్లో భద్రతను ప్రధాని,రక్షణ మంత్రి అంచనా వేస్తున్నారని ప్రధాని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. దీనితో పాటు ఇజ్రాయెల్ ప్రస్తుతం నివాసితులను ఇంటి లోపల ఉండాలని ఆదేశించింది.
Read Also:The farmer died : రైలు వేగానికి ఎగిరిపడి రైతు మృతి
Rockets firing hasn’t stopped since the morning! #Gaza pic.twitter.com/cw7U9acgPp
— Muhammad Smiry 🇵🇸 (@MuhammadSmiry) October 7, 2023
అంతకుముందు, ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా “ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్” ప్రారంభించినట్లు ప్రకటించినందున, ఇజ్రాయెల్పై 5,000 కంటే ఎక్కువ రాకెట్లను ప్రయోగించామని హమాస్ తెలిపింది. తాజా పరిస్థితులను చూస్తుంటే.. ఇజ్రాయెల్ సైన్యం కూడా యుద్ధానికి సిద్ధమని చెప్పింది. సైన్యం తమ సైనికులకు ‘యుద్ధానికి సంసిద్ధత’ హెచ్చరిక జారీ చేసింది. దీనితో పాటు గాజాలోని విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. నిజానికి ఈ ప్రాంతంలో కనీసం 100 ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతోంది. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్, గోలన్ హైట్స్ వంటి ప్రాంతాలపై వివాదం ఉంది. తూర్పు జెరూసలేంతో సహా ఈ ప్రాంతాలపై పాలస్తీనా వాదిస్తోంది. జెరూసలేంపై తన వాదనను వదులుకోవడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. ప్రతిరోజూ ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..