Israel: ఇజ్రాయిల్ పౌరులను బందీలుగా పట్టుకున్న హమాస్ ఉగ్రవాదులు.. వైరలవుతున్న వీడియోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్ పాలస్తీనాల మధ్య తీవ్ర యుద్ధం చెలరేగింది. గాజా స్ట్రిప్ని పాలిస్తున్న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై మెరుపుదాడి చేశారు. పటిష్ట ఇంటెలిజెన్స్ నిఘా, గూఢచార సంస్థలు ఉన్న ఇజ్రాయిల్ ఈ దాడుల్ని ఊహించలేకపోయింది. ఏకంగా 20 నిమిషాల్లోనే 5000 రాకెట్లను ప్రయోగించింది. ఇప్పటికే ఈ దాడుల వల్ల ఇజ్రాయిల్ లో 40 మంది మరణించారు. 700 మందికి పైగా గాయాలయ్యాయి.
ఇదిలా ఉంటే దాడులతో పాటు ఇజ్రాయిల్ భూభాగాల్లోకి ఎంట్రీ అయిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ సైనికులను, సాధారణ పౌరులను బందీలుగా చేసుకుని, గాజ్రా స్ట్రిప్ లోకి తీసుకెళ్లారు. హమాస్ ఉగ్రవాదులు బందీలను పట్టుకుంటున్న వీడియోను రిలీజ్ చేసింది. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉగ్రవాదులు నడిరోడ్డుపై ప్రజలను కాల్చి చంపేయడం వంటివి ఇందులో ఉన్నాయి.
Also Read
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- 43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
- Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
Read Also: Israel: ఇజ్రాయిల్లో 40 మంది.. పాలస్తీనాలో 161 మంది మృతి..
ఉగ్రవాదులు విదేశీయులను కూడా పట్టుకున్నారని తెలుస్తోంది. ఇజ్రాయిల్ లో ఏడుగురు నేపాలీలు గాయపడ్డారని, 17 మందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారని ఇజ్రాయిల్ లోని నేపాల్ రాయబారి తెలిపారు. ఇజ్రాయిల్ పౌరులను బందీలుగా పట్టుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పటి వరకు వ్యాఖ్యానించలేదు.
https://twitter.com/Iyervval/status/1710595368722055520
హమాస్ అధికార ప్రతినిధి ఖలీద్ ఖడోమీ ఆల్ జజీరా ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో హమాస్ చర్యల్ని సమర్థించాడు. అనేక ఏళ్లుగా పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న దురాగతాలకు, గాజా, అల్-అక్సా వంటి పాలస్తీనా పవిత్ర స్థలాలకు వ్యతిరేకంగా జరిగిన దురాగతలకు ప్రతిస్పందనగా పేర్కొన్నాడు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోని ఇజ్రాయిల్ ని నిలువరించాలని కోరాడు.
ఇదిలా ఉంటే బందీలుగా పట్టుకున్న వారిని విడుదల చేయాలని ఈయూ విదేశాంగ పాలసీ చీఫ్ జోసెప్ బోరెల్ పిలుపునిచ్చారు. మరోవైపు దీన్ని యుద్ధంగా ప్రకటించింది ఇజ్రాయిల్. గాజాను చుట్టుముట్టిని ఇజ్రాయిల్ సైన్యం, వైమానికి దాడులు చేస్తోంది. ముఖ్యంగా హమాస్ స్థావరాలపై బాంబులు కురిపిస్తోంది.
🚨More hostages being taken into Gaza, no one is safe from these murdering scumbags #Israel #Palestinian #Hamas #OperationIronSwords #Gaza #Islamists #Mossad #IsraelUnderAttack #PalestineUnderAttack #AlAqsaFlood #stateofwar #TelAviv #Iran #Jerusalem pic.twitter.com/By34YyoQwH
— Blogsroom (@theblogsroom) October 7, 2023
Hamas terrorists continue to take Israeli women hostage
Official authorities have not yet commented on the information about the captives. According to Israeli news channel N12, about 50 Israeli hostages are currently being held by Hamas militants. pic.twitter.com/Cn0NG94WvL
— NEXTA (@nexta_tv) October 7, 2023
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!