పశ్చియాసియాకు మంచి రోజులు రాబోతున్నాయి. గత కొద్ది రోజులుగా బాంబుల మోతలు, రాకెట్ల దాడులతో యుద్ధ భూమి దద్దరిల్లింది. రక్తం ఏరులైపారింది. ఆస్తులు నేలమట్టం అయ్యాయి. సర్వం కోల్పోయి ప్రజలు దిక్కులేనివారయ్యారు. ఈ మారణహోమాన్ని మరింత సాగదీయకుండా ముగింపు పలకాలని నిర్ణయానికి వచ్చాయి.
ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య వార్ మరోసారి ఉధృతం అయింది. ఇజ్రాయెల్ సైన్యమే లక్ష్యంగా హిజ్బుల్లా రెచ్చిపోయింది. ఆదివారం ఒకేసారి 250 రాకెట్లను ప్రయోగించింది. ఇరాన్ మద్దతుతో ఈ రాకెట్లను ప్రయోగించింది. లెబనాన్ సరిహద్దు ప్రాంతం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించింది.
Israeli Airstrikes : ఇజ్రాయెల్ డమాస్కస్ పశ్చిమ శివార్లలో, రాజధాని శివారులో రెండు వైమానిక దాడులను నిర్వహించింది. ఈ దాడిలో కనీసం 15 మంది మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. డమాస్కస్లోని మజే పరిసరాల్లో, రాజధానికి వాయువ్యంగా ఉన్న ఖుద్సయా శివారులో వైమానిక దాడుల్లో రెండు భవనాలు దెబ్బతిన్నాయి. నేలమాళిగను ఢీకొన్న క్షిపణి ధాటికి ఐదు అంతస్తుల భవనం దెబ్బతింది. సిరియాలోని ఇస్లామిక్ జిహాద్ టెర్రరిస్టు గ్రూప్కి చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైట్లు, కమాండ్ సెంటర్లపై దాడి…
లెబనాన్ రాజధాని బీరుట్ సమీపంలోని ఓ గ్రామంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడి చేసింది. ఈ దాడిలో 7 మంది చిన్నారులు సహా 23 మంది మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్, లెబనాన్లోని హిజ్బుల్లా మధ్య భారీ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) లెబనాన్ లోపల హిజ్బుల్లా లక్ష్యాలపై వైమానిక దాడులు చేస్తోంది.
Israel Hezbollah War: ఇజ్రాయెల్, లెబనాన్ కు చెందిన హెజ్బొల్లా గ్రూప్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ టెల్ అవీవ్ శివార్లలోని తా అని పిలువబడే ఇజ్రాయెల్ మిలిటరీ ఇండస్ట్రీస్ లిమిటెడ్పై హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ క్షిపణులతో దాడి చేసింది.
Israel Hezbollah War: హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. తాజాగా జరిగిన దాడుల్లో హిజ్బుల్లా బంకర్ నుంచి ఏకంగా 500 మిలియన్ డాలర్ల డబ్బు, బంగారాన్ని కనుగొన్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. హిజ్బుల్లాకు నిధులు, దాని కార్యకలాపాల కోసమే ఈ డబ్బును వినియోగిస్తున్నట్లు తెలిపింది.
Israel Hezbollah War: లెబనాన్లో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థని నామరూపాలు లేకుండా చేయాలని ఇజ్రాయిల్ భీకరదాడులు చేస్తోంది. ఇప్పటికే రాజధాని బీరూట్పై వైమానికి దాడులతో విరుచుకుపడుతోంది. ఇక దక్షిణ లెబనాన్పై భూతల దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు 2000కి పైగా హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. గత వారం హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని ఇజ్రాయిల్ బీరూట్ ఎయిర్ స్ట్రైక్స్లో హతమార్చింది.
హిజ్బుల్లా, ఇరాన్తో విభేదాల మధ్య అరబ్ దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్కు గట్టి ఎదురుదెబ్బ తగిలాయి. టెహ్రాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదంలో తాము తటస్థంగా ఉంటామని ఇరాన్కు భరోసా ఇవ్వడానికి అరబ్ దేశాలు ఈ వారం దోహాలో సమావేశమయ్యాయి. ఈ ప్రాంతంలో వివాదాలు పెరగడం వల్ల తమ చమురు కేంద్రాలకు ముప్పు వాటిల్లుతుందని అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
లెబనాన్లోని హిజ్బుల్లాపై సైనిక చర్యను ప్రారంభించిన ఇజ్రాయెల్పై ఇరాన్ మంగళవారం క్షిపణులను ప్రయోగించింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా మృతికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని, ఎలాంటి ప్రతీకార చర్యలనైనా ఎదుర్కొనేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు బంకర్ బస్టర్ గురించే చర్చ జరుగుతోంది. అత్యంత రహ్యస ప్రాంతంలో దాగి ఉన్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను బంకర్ బస్టర్ అంతమొందించింది. భూగర్భంలో దాదాపు 60 అడుగుల లోతులో అండర్గ్రౌండ్లో భద్రతా బలగాల కాపుదలలో ఉన్న నస్రల్లాను లేపేసింది. ఇప్పుడే ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.