Israel-Hezbollah War: చల్లబడనున్న పశ్చిమాసియా.. యుద్ధంపై ఇరుపక్షాలు సంధి!
- చల్లబడనున్న పశ్చిమాసియా
- యుద్ధంపై ఇరుపక్షాలు సంధి!
- ప్రధాని నెతన్యాహు సూత్రప్రాయ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చియాసియాకు మంచి రోజులు రాబోతున్నాయి. గత కొద్ది రోజులుగా బాంబుల మోతలు, రాకెట్ల దాడులతో యుద్ధ భూమి దద్దరిల్లింది. రక్తం ఏరులైపారింది. ఆస్తులు నేలమట్టం అయ్యాయి. సర్వం కోల్పోయి ప్రజలు దిక్కులేనివారయ్యారు. ఈ మారణహోమాన్ని మరింత సాగదీయకుండా ముగింపు పలకాలని నిర్ణయానికి వచ్చాయి. ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య సంధి కుదిరినట్లు తెలుస్తోంది. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: IPL 2025 Mega Auction: మెగా వేలంలో అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీపై కనక వర్షం..
Also Read
- Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
- China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
హిజ్బుల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్- హెజ్బుల్లా మధ్య గతకొద్దిరోజులుగా పరస్పర దాడులు జరుగుతున్నాయి. అయితే ఇటీవల యూఎస్ ప్రత్యేక రాయబారి అమోస్ హోచ్స్టెయిన్ లెబనాన్లో పర్యటించారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్చలు జరిపారు. లెబనాన్ పర్యటన తర్వాత ఇజ్రాయెల్కు వెళ్లారు. ఇరుదేశాలతో చర్చించి యుద్ధానికి ముగింపు పలకాలని భావించారు. ఇరుపక్షాలతో చర్చలు జరిపారు. చివరికి ఈ చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
ఇది కూడా చదవండి: Tummala Nageswara Rao : ఖమ్మం నలుదిక్కులా మొక్కలు కనిపించేలా అధికారులు కృషి చేయాలి
ఇదిలా ఉంటే ఆదివారం కూడా ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య వార్ ఉధృతం సాగింది. ఇజ్రాయెల్ సైన్యమే లక్ష్యంగా హిజ్బుల్లా రెచ్చిపోయింది. ఆదివారం ఒకేసారి 250 రాకెట్లను ప్రయోగించింది. ఇరాన్ మద్దతుతో ఈ రాకెట్లను ప్రయోగించింది. లెబనాన్ సరిహద్దు ప్రాంతం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించింది. కొన్ని టెల్ అవీవ్ ప్రాంతంలో పడగా.. మరికొన్నింటినీ ఐడీఎఫ్ దళాలు గగనతలంలో పేల్చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను హిజ్బుల్లా సోషల్ మీడియాలో వీడియోలు పంచుకుంది. ఇక ఇజ్రాయెల్లోని ఒక ఇంటిపై క్షిపణి పడడంతో మంటల్లో కాలిపోయింది. మరొక క్షిపణి కారణంగా కార్లు దగ్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. మొత్తానికి ఇరుపక్షాలు సంధికి రావడం శుభపరిణామం అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!