Pakistan: పాక్లో అంతా రివర్స్.. రక్షణ మంత్రిని మందలించిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్..
- రక్షణ మంత్రిని మందలించిన పాక్ ఆర్మీ చీఫ్ ..
- మునీర్ ఆగ్రహంతో ఇజ్రాయిల్ ట్వీట్ డిలీట్ చేసిన ఖ్వాజా ఆసిఫ్..
Pakistan: సాధారణంగా ఏ దేశంలో అయినా రక్షణ మంత్రికి ఆర్మీ చీఫ్లు జవాబుదారీగా ఉంటారు. రక్షణ మంత్రి ఆదేశాలను పాటిస్తారు. కానీ పాకిస్తాన్లో మాత్రం బయటకు ప్రజా ప్రభుత్వం కనిపిస్తున్నా, నడిపించేది అంతా పాకిస్తాన్ సైన్యమే. ఆ దేశంలో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తి ఆర్మీ చీఫ్. ఇప్పుడు ఆ పదవిలో అసిమ్ మునీర్ ఉన్నారు. మునీర్ చెప్పినట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆడుతున్నారు. ఇక ఇతర మంత్రులు సంగతి చెప్పనక్కర లేదు.
ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ను ఆర్మీ చీఫ్, సైన్యాధిపతి అసిమ్ మునీర్ తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రి ఇజ్రాయిల్ను ‘‘మానవాళికి శాపం’’గా అభివర్ణిస్తూ ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. దీనిపై ఇజ్రాయిల్ స్పందిస్తూ.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వ సామర్థ్యాలను ప్రశ్నించింది. అమెరికా-ఇరాన్ చర్చల వేళ ఈ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీంతో వెంటనే ఈ ట్వీట్ డిలీట్ చేయాలని ఆసిమ్ మునీర్, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ను ఆదేశించారు. ఇలాంటి బాధ్యతారహితమైన పోస్టులు పెట్టొద్దని హెచ్చరించినట్లు నివేదికలు చెబుతున్నారు.
Also Read
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
Read Also: Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్ప్రెస్లు రద్దు..
మరోవైపు, పాకిస్తాన్ సొంత మంత్రుల బాధ్యతారహిత ప్రవర్తననను నియంత్రించలేకపోతుందని అమెరికా ఎక్కువగా భావిస్తోందని, ఈ పరిస్థితి పాక్ మధ్యవర్తిత్వ పాత్రను బలహీనపరుస్తుందని, అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రక్రియకు అంతరాయం కలిగించే ప్రమాదం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నేతృత్వంలోని పాకిస్తాన్ సైన్యం విదేశాంగ విధానంపై నిర్ణయాత్మక నియంత్రణను కొనసాగిస్తోందని, దీంతో ఎన్నికైన ప్రభుత్వానికి పరిమిత అధికారాలు మాత్రమే మిగిలాయని ఆ నివేదిక ఇంకా పేర్కొంది.
ఇలాంటి సమయంలో మధ్యవర్తిత్వం విఫలమైతే గల్ఫ్ లో మళ్లీ ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందని పాకిస్తాన్ భావిస్తోంది. ఇప్పటికే ఈ యుద్ధం వల్ల పాక్ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగింది. ఇంధన కొరతతో పాక్ ప్రజలు సతమతమవుతున్నారు. ఖ్వాజా ఆసిఫ్ ఇజ్రాయిల్ పోస్ట్పై అసిమ్ మునీర్ కలుగజేసుకోవడంతోనే దానిని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!