Pakistan: పాక్లో అంతా రివర్స్.. రక్షణ మంత్రిని మందలించిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్..
- రక్షణ మంత్రిని మందలించిన పాక్ ఆర్మీ చీఫ్ ..
- మునీర్ ఆగ్రహంతో ఇజ్రాయిల్ ట్వీట్ డిలీట్ చేసిన ఖ్వాజా ఆసిఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: సాధారణంగా ఏ దేశంలో అయినా రక్షణ మంత్రికి ఆర్మీ చీఫ్లు జవాబుదారీగా ఉంటారు. రక్షణ మంత్రి ఆదేశాలను పాటిస్తారు. కానీ పాకిస్తాన్లో మాత్రం బయటకు ప్రజా ప్రభుత్వం కనిపిస్తున్నా, నడిపించేది అంతా పాకిస్తాన్ సైన్యమే. ఆ దేశంలో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తి ఆర్మీ చీఫ్. ఇప్పుడు ఆ పదవిలో అసిమ్ మునీర్ ఉన్నారు. మునీర్ చెప్పినట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆడుతున్నారు. ఇక ఇతర మంత్రులు సంగతి చెప్పనక్కర లేదు.
ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ను ఆర్మీ చీఫ్, సైన్యాధిపతి అసిమ్ మునీర్ తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రి ఇజ్రాయిల్ను ‘‘మానవాళికి శాపం’’గా అభివర్ణిస్తూ ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. దీనిపై ఇజ్రాయిల్ స్పందిస్తూ.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వ సామర్థ్యాలను ప్రశ్నించింది. అమెరికా-ఇరాన్ చర్చల వేళ ఈ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీంతో వెంటనే ఈ ట్వీట్ డిలీట్ చేయాలని ఆసిమ్ మునీర్, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ను ఆదేశించారు. ఇలాంటి బాధ్యతారహితమైన పోస్టులు పెట్టొద్దని హెచ్చరించినట్లు నివేదికలు చెబుతున్నారు.
Also Read
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
Read Also: Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్ప్రెస్లు రద్దు..
మరోవైపు, పాకిస్తాన్ సొంత మంత్రుల బాధ్యతారహిత ప్రవర్తననను నియంత్రించలేకపోతుందని అమెరికా ఎక్కువగా భావిస్తోందని, ఈ పరిస్థితి పాక్ మధ్యవర్తిత్వ పాత్రను బలహీనపరుస్తుందని, అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రక్రియకు అంతరాయం కలిగించే ప్రమాదం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నేతృత్వంలోని పాకిస్తాన్ సైన్యం విదేశాంగ విధానంపై నిర్ణయాత్మక నియంత్రణను కొనసాగిస్తోందని, దీంతో ఎన్నికైన ప్రభుత్వానికి పరిమిత అధికారాలు మాత్రమే మిగిలాయని ఆ నివేదిక ఇంకా పేర్కొంది.
ఇలాంటి సమయంలో మధ్యవర్తిత్వం విఫలమైతే గల్ఫ్ లో మళ్లీ ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందని పాకిస్తాన్ భావిస్తోంది. ఇప్పటికే ఈ యుద్ధం వల్ల పాక్ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగింది. ఇంధన కొరతతో పాక్ ప్రజలు సతమతమవుతున్నారు. ఖ్వాజా ఆసిఫ్ ఇజ్రాయిల్ పోస్ట్పై అసిమ్ మునీర్ కలుగజేసుకోవడంతోనే దానిని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!