ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా పడుతోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రీమియం పెట్రోల్తో పాటు ఇండస్ట్రియల్ డీజిల్ ధరలను కూడా పెంచాయి. పారిశ్రామిక డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు రూ.22.03 పెరిగింది. దీని ధరను లీటరుకు రూ.87.57 నుండి రూ.109.59కి పెంచారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) పారిశ్రామిక డీజిల్ ధరను లీటరుకు రూ.87.67 నుండి రూ.109.59కి పెంచింది.…
Story Board: ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ ఏదో రెండు దేశాల మధ్య జరుగుతున్నవి మాత్రమే కాదు. ఎందుకంటే అమెరికా యుద్ధరీతుల్ని పూర్తిగా మార్చేసింది. గతంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే.. గెలిచిన దేశం ఓడిన దేశంపై పెత్తనం చేసేది. కానీ అగ్రరాజ్యం మాత్రం అంతకు మించిన లోతైన వ్యూహాలు అమలు చేస్తోంది. తన మాట వినని దేశాధినేతల్ని తప్పించేసి.. ఆయా దేశాల్లో తమకు అనుకూల ప్రభుత్వాలు కొలువుదీరేలా పావులు కదుపుతోంది. ఇప్పుడు ఇరాన్లో ఖమేనీ అయినా..…
Iran: ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నష్టాలకు, ప్రాణ నష్టాలకు, నిందలకు డొనాల్డ్ ట్రంప్ కారకుడని ఆరోపించారు. ట్రంప్ ఒక ‘‘నేరస్తుడు’’ అని అభివర్ణించారు. అమెరికానే ఇరాన్లో అశాంతిని సృష్టిస్తోందని ఖమేనీ అన్నారు.