Trump: హార్ముజ్పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన
- హార్ముజ్పై ట్రంప్ కఠిన నిర్ణయం
- ఇరాన్కు తీవ్ర వార్నింగ్లు
- ప్రపంచ దేశాలు ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్ మోగబోతున్నాయా? ఇరాన్ మరింత ఉక్కిరిబిక్కిరి కాబోతుందా?. చమురు, గ్యాస్ కష్టాలు మరింత తీవ్రం కాబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా హార్ముజ్పై ట్రంప్ డెడ్లాక్ విధించారు. దీంతో పరిస్థితులు మరింత సంక్షోభం దిశగా వెళ్తొచ్చని సంకేతాలు వెళ్తున్నాయి.
తాజాగా ట్రంప్ మాట్లాడుతూ హార్ముజ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు ఒప్పందం చేసుకునేంత వరకు హార్ముజ్ జలసంధిపై విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయబోమని తేల్చి చెప్పారు. ముందు దిగ్బంధం ఎత్తేస్తేనే అణు ఒప్పందంపై చర్చిస్తామన్న ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు. ఇరాన్ ముందు తగిన విధంగా అణు ఒప్పందం చేసుకుంటనే దిగ్బంధాన్ని ఎత్తివేస్తామని.. లేదంటే దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read
తాజా దిగ్బంధం బాంబు దాడుల కంటే మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆక్సియోస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు. ఇరాన్ పరిస్థితి ప్రస్తుతం తీవ్రంగా ఉందని.. వారు పూర్తిగా ఒత్తిడిలో ఉన్నారని.. వారికి ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు ఉండకూడదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
పోస్ట్ వైరల్
ఇక ట్రంప్ తన సోషల్ మీడియాలో ఏఐతో రూపొందించిన చిత్రాన్ని షేర్ చేశారు. ఆ చిత్రంలో ఆయుధంతో కనిపించారు. నల్ల సూటు ధరించి.. కళ్ళద్దాలు పెట్టుకుని.. చేతిలో అసాల్ట్ రైఫిల్ పట్టుకున్న చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఆ చిత్రానికి క్యాప్షన్లో.. ‘‘ఇరాన్ సరిగ్గా ప్రవర్తించలేకపోతోంది. అణ్వాయుధ రహిత ఒప్పందంపై ఎలా సంతకం చేయాలో వారికి తెలియదు. వారు త్వరగా బుద్ధి తెచ్చుకోవాలి! ఇకపై నేను మంచివాడిని కాను!.’’ అని రాసుకొచ్చారు.
సైనిక హెచ్చరిక
దిగ్బంధమే ప్రధాన ఒత్తిడి సాధనంగా ఉన్నప్పటికీ.. అవసరమైతే సైనిక చర్యకు కూడా సిద్ధమని ట్రంప్ సూచించారు. ఇరాన్ చమురు ఎగుమతులు పూర్తిగా ఆగిపోవడంతో పైప్లైన్లు కూడా ప్రమాదంలో ఉన్నాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
ఇరాన్ ప్రతిస్పందన
అమెరికా చర్యలకు ఇరాన్ భద్రతా వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ‘‘దిగ్బంధం కొనసాగితే మేము అనూహ్యమైన చర్యలు తీసుకుంటాం.’’ అని హెచ్చరించాయి. దౌత్యానికి అవకాశం ఇస్తున్నప్పటికీ.. సహనానికి కూడా పరిమితులు ఉన్నాయని స్పష్టం చేశాయి.
ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. దీంతో ప్రతీకారంగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. దీంతో చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. దాదాపు రెండు నెలల నుంచి ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ఇరాన్ అణు ఒప్పందం చేసుకోకపోవడంతో అమెరికా హార్ముజ్ను దిగ్బంధించింది. దీంతో చమురు సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే ఆయా దేశాల్లో సంక్షోభం నెలకొంది. తాజాగా ఆ దిగ్బంధాన్ని మరింత తీవ్రం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ప్రపంచ దేశాల్లో ఆందోళనలు మొదలయ్యాయి.
తాజావార్తలు
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!