RCB vs RR: నేడు బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రజత్ పాటిదార్ నాయకత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ లో ఇప్పటివరకు మంచి ప్రదర్శన ఇచ్చింది. మొత్తం 8 మ్యాచ్ లలో ఐదు మ్యాచ్లను గెలిచి పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. అయితే, ఆ జట్టు తన సొంత…
Surya Kumar Yadav: ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), ముంబై ఇండియన్స్ (MI) మధ్య బుధవారం జరిగిన మ్యాచ్లో ఒక ఆసక్తికర సంఘటన అభిమానులను నవ్వించింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది వరకు పంజాబ్ మ్యాచ్ లో వీరబాదుడు బాదిన…
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి.. ఐదు విజయాలు సాధించింది. ఈ ఐదు విజయాలు బయటి మైదానాల్లో సాధించినవే కావడం గమనార్హం. హోంగ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడు మ్యాచ్లలో ఆర్సీబీ ఓడిపోయింది. నేడు సొంత మైదానంలో ఆడేందుకు సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్తో బెంగళూరు తలపడనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ హోంగ్రౌండ్ ప్రదర్శనపై స్పందించాడు. ఓటములకు సాకులు చెప్పడం సరైంది కాదన్నాడు. ‘చిన్నస్వామి స్టేడియం పిచ్లు కాస్త…
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చాలా ప్రశాంతంగా ఉంటాడు. మైదానంలో ఎంత ఒత్తిడి ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. మొహం మీద చిరునవ్వు ఉంటుంది. ప్రత్యర్థి బ్యాటర్ తన బౌలింగ్లో బౌండరీలు, సిక్సులు బాదినా.. నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. మైదానంలో ఏ ఆటగాడికైనా గాయం అయితే పలకరిస్తాడు. అయితే తాజాగా బుమ్రా ప్రవర్థించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు బుమ్రా వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?. ఐపీఎల్…
తాను ముంబై ఇండియన్స్లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు విన్నింగ్ ఫీల్ను పొందలేదని హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ తెలిపాడు. తాను 2022లో ముంబై జట్టులో చేరా అని, అప్పటి నుంచి తాము ట్రోఫీని గెలవలేదన్నాడు. వ్యక్తిగతంగా గత మూడు సీజన్లు బాగానే సాగాయని, జట్టు పరంగా కోరుకున్న ఫలితాలు మాత్రం రాలేదన్నాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్లేయర్లకు మద్దతుగా ఉంటాడని, ఏదైనా తప్పు చేస్తే ముఖం మీదే చెప్పేస్తాడని తిలక్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో తిలక్…
భారత జట్టులో చోటే తన లక్ష్యం అని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ అభిషేక్ పోరెల్ చెప్పాడు. ప్రస్తుతానికి ఢిల్లీ తరఫున ఆడుతూ పెద్ద స్కోర్లు చేయడంపైనే దృష్టి పెట్టా అని, భవిష్యత్తు లక్ష్యం మాత్రం టీమిండియాకు ఆడడమే అని తెలిపాడు. డీసీ కోచ్లు, కెప్టెన్ తనకు మద్దతుగా నిలుస్తున్నారని.. వారి సలహాలు, సూచనలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా అని అభిషేక్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన అభిషేక్.. 225 రన్స్…
టీమిండియా స్టార్, ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో బుమ్రా 300 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ను అవుట్ చేయడంతో బుమ్రా ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో అత్యంత వేగంగా 300 వికెట్స్ పడగొట్టిన మొదటి భారత బౌలర్గా నిలిచాడు. 237…
ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఈ సీజన్లో ఓ సెంచరీ తప్పితే.. మరో మంచి ఇన్నింగ్స్ ఆడింది లేదు. ఎస్ఆర్హెచ్కు కీలకమైన మ్యాచ్ ముంబై ఇండియన్స్పై కూడా ఇషాన్ పూర్తిగా నిరాశపరిచాడు. బుధవారం రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నాలుగు బంతులు ఆడి.. ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. అయితే ఈ మ్యాచ్లో ఇషాన్ అవుట్ అవ్వడం ఇప్పుడు సోషల్…
టీ20 క్రికెట్లో హిట్మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో 12 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయుడిగా రోహిత్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్పై (70; 46 బంతుల్లో 8×4, 3×6) హాఫ్ సెంచరీ బాదడంతో ఈ మైలురాయిని సాధించాడు. జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (13,208) హిట్మ్యాన్ కంటే ముందున్నాడు. మొత్తంగా టీ20 క్రికెట్లో 12 వేల పరుగులు చేసిన ఎనిమిదవ…
SRH vs MI: ఐపీఎల్ 2025 (18వ సీజన్)లో ముంబై ఇండియన్స్ చెలరేగిపోతోంది. ప్రారంభ మ్యాచ్లో ఓటమిని చవిచూసిన హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు, ఆ తర్వాత వరుసగా నాలుగు విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ముంబై 7 వికెట్ల తేడాతో ఓడించింది. హైదరాబాద్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని ముంబై సులువుగా ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ 36 బంతుల్లో 70 పరుగులు చేసి ముంబై విజయానికి…