Rajat Patidar: హోంగ్రౌండ్ ఓటములకు సాకులు చెప్పడం సరైంది కాదు!
- ఐపీఎల్ 2025లో 8 మ్యాచ్లు ఆడి ఐదు విజయాలు
- హోంగ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఓటములు
- హోంగ్రౌండ్ ప్రదర్శనపై స్పందించిన రజత్ పటీదార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి.. ఐదు విజయాలు సాధించింది. ఈ ఐదు విజయాలు బయటి మైదానాల్లో సాధించినవే కావడం గమనార్హం. హోంగ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడు మ్యాచ్లలో ఆర్సీబీ ఓడిపోయింది. నేడు సొంత మైదానంలో ఆడేందుకు సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్తో బెంగళూరు తలపడనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ హోంగ్రౌండ్ ప్రదర్శనపై స్పందించాడు. ఓటములకు సాకులు చెప్పడం సరైంది కాదన్నాడు.
‘చిన్నస్వామి స్టేడియం పిచ్లు కాస్త క్లిష్టంగా ఉన్నాయి. ఈ కారణంగానే హోంగ్రౌండ్లో మేం ఓడిపోతున్నామని చెప్పడం సరైంది కాదు. ఇప్పటివరకు మేం హోంగ్రౌండ్లోలో బాగా ఆడలేదు. బయటి వేదికల్లో గొప్పగానే ఆడాం, కీలక విజయాలు సాధించాం. టాస్ గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అది నా చేతుల్లో లేదు. పిచ్లు మాత్రం అంచనాలకు భిన్నంగా స్పందిస్తున్నాయి. మేం త్వరగా ఆ పరిస్థితులను అలవాటు పడాల్సి ఉంటుంది. టాస్ ఓడినంత మాత్రాన సగం మ్యాచ్ కోల్పోయినట్లు కాదు. ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చినపుడు అత్యుత్తమంగా ఆడి స్కోరు బోర్డుపై పరుగులు ఉంచాలి. కాబట్టి టాస్ మీద కంటే మ్యాచ్ పైనే ఎక్కువ దృష్టి పెడతాం. హోంగ్రౌండ్లో ఓటమి పాలయ్యామని ఎప్పుడూమాట్లాడుతూ ఉండం. ఈరోజు మ్యాచ్పై దృష్టి పెట్టి.. విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం’ అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
Also Read: Jasprit Bumrah: బుమ్రా.. కాస్తైనా కనికరం ఉండక్కర్లా!
ఐదు విజయాలతో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్పై భారీ విజయం సాధిస్తే.. అగ్రస్థానానికి చేరుకొనే అవకాశం ఉంది. మాములు విజయం సాధిస్తే.. మూడో స్థానానికి చేరుకుంటుంది. గుజరాత్ (12), ఢిల్లీ (12)లు నెట్ రన్రేట్లో ముందున్నాయి. పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్కు చేరుకుంటాయి. టాప్ -2లోని నిలిచిన టీమ్లకు నాకౌట్ స్టేజ్లో రెండు అవకాశాలు ఉంటాయి.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!