తెలంగాణ రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డు పరీక్షల పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. ఈసారి ఇంటర్ పరీక్షలు మామూలుగా మార్చిలో కాకుండా ముందుగానే ఫిబ్రవరిలోనే ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం విద్యార్థులు JEE మెయిన్, EAPCET (EAMCET), NEET వంటి పోటీ పరీక్షలకు సులభంగా సిద్ధం కావడానికి ఎక్కువ సమయం దొరకడం. ఈ…
Promotions : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్ పరిధిలో పనిచేస్తున్న 81 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్ పదోన్నతులు లభించాయి. సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈ పదోన్నతులను అధికారికంగా ప్రకటిస్తూ, ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి పరీక్షల నియంత్రణాధికారి జయప్రదా బాయి, మెదక్, రంగారెడ్డి జిల్లాల డీఐఈఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ, పదోన్నతి పొందిన లెక్చరర్లను శుభాకాంక్షలు తెలియజేశారు. Off…
Inter Results : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగించబడ్డాయి, మరియు ఇప్పుడు విద్యార్థులు ఫలితాలను కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సమయంలో, విద్యార్థుల మనసులో టెన్షన్ పెరిగిపోతున్నది, అలాగే వారు ప్రశాంతంగా విరామం తీసుకోవాలని కోరుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం, పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం మూల్యాంకనంలో కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. పరీక్ష ఫలితాలు విడుదలయ్యాక, ఫెయిల్ అయిన విద్యార్థుల ప్రశ్నాపత్రాలను మరోసారి వేరిఫై చేయడం జరుగుతుంది.…
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి (TGBIE) గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఈ సెలవులు మార్చి 30, 2025 నుంచి ప్రారంభమై జూన్ 1, 2025 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలు ఈ షెడ్యూల్ను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలోని జూనియర్ జాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రేపటి(నవంబర్ 6) నుంచి నవంబర్ 26వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశాన్ని కల్పించింది. రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 4 వరకు అవకాశాన్ని కల్పించారు
షెడ్యూల్ రాకముందే అడ్మిషన్లు తీసుకుంటే ప్రైవేట్ జూనియర్ కాలేజీల పై చర్యలు ఉంటాయని ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. పీఆర్వోలను పెట్టుకొని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇంటర్లో అడ్మిషన్లు చేయిస్తున్నాయనే అంశం తమ దృష్టికి వచ్చిందని బోర్డు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఇదివరకే పూర్తయ్యాయి. మార్చి 1 నుండి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు వోకేషనల్ కోర్స్ తో కలిపి 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 52,900 విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వలేదు. 75 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ కు ప్రయత్నించారు. వీటికి సంబంధించి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇంటర్మీడియట్ సంబంధించిన ఇంటర్ సమాధాన పత్రాలు మూల్యాంకనం కూడా మొదలైంది.…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 19 వరకు జరిగే ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగనున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. ఈ పరీక్షల హాల్ టికెట్లను ఇవాళ్టి నుంచి జారీ చేయనుంది.