Telangana Inter Exams : విద్యార్థులకు అలర్ట్.. షెడ్యూల్ వచ్చేసింది..!
- ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు
- విద్యార్థుల పోటీ పరీక్షల సిద్ధతకు అవకాశం
- 12 ఏళ్ల తర్వాత ఇంటర్ సిలబస్లో కీలక మార్పులు
- నవంబర్ 11 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు గడువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. ఈసారి ఇంటర్ పరీక్షలు మామూలుగా మార్చిలో కాకుండా ముందుగానే ఫిబ్రవరిలోనే ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం విద్యార్థులు JEE మెయిన్, EAPCET (EAMCET), NEET వంటి పోటీ పరీక్షలకు సులభంగా సిద్ధం కావడానికి ఎక్కువ సమయం దొరకడం. ఈ మార్పుతో విద్యార్థులకు ప్రిపరేషన్ కోసం అదనపు సమయం లభిస్తుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఇంటర్ సిలబస్లో కీలక మార్పులు చేయబోతున్నట్లు ప్రకటించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సిలబస్లో మార్పులు అమలుకానున్నాయి. గణితం, రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం వంటి ముఖ్యమైన సబ్జెక్టుల్లో కొత్త కాన్సెప్ట్స్ చేర్చబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఇప్పటివరకు కేవలం సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే ప్రాక్టికల్ పరీక్షలు ఉండగా, ఈసారి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకూ ల్యాబ్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయించారు.
Also Read
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
జనవరి 21న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష, జనవరి 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, జనవరి 24న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 25 నుంచి ఫస్ట్ ఇయర్ రాత పరీక్షలు, ఫిబ్రవరి 26 నుంచి సెకండ్ ఇయర్ రాత పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇక ప్రాక్టికల్ పరీక్షలు జనవరి చివరి వారంలో ప్రారంభమై, ఫిబ్రవరి మొదటి వారంలో ముగియనున్నాయి.
పరీక్ష ఫీజుల చెల్లింపు ప్రక్రియ నవంబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు ఆన్లైన్ ద్వారా కొనసాగుతుందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. విద్యార్థులు గడువులోపు ఫీజులు చెల్లించి తమ హాల్టికెట్లు పొందాలని సూచించింది. ఈసారి విడుదలైన షెడ్యూల్ వల్ల విద్యార్థులు పోటీ పరీక్షలకు మరింత సమర్థవంతంగా సిద్ధం కావడానికి అవకాశం లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!