Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Inter Exams 2025 Students Details Correction

Inter Board : విద్యార్థులకు అలర్ట్.. బోర్డు కొత్త మార్గదర్శకాలు..!

Published Date :November 26, 2025 , 6:50 pm
By Gogikar Sai Krishna
  • ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 25 నుండి ప్రారంభం
  • విద్యార్థుల వివరాల్లో పొరపాట్ల సవరణకు బోర్డు కొత్త మార్గదర్శకాలు
  • నవంబర్ 30 వరకు నామినల్‌ రోల్స్‌ లో తప్పులు సరిచేసుకునే అవకాశం
  • తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపనున్న ఇంటర్‌ బోర్డు
Inter Board : విద్యార్థులకు అలర్ట్.. బోర్డు కొత్త మార్గదర్శకాలు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Inter Board : తెలంగాణ రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డు పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, ప్రతీ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు సమయంలో విద్యార్థుల వ్యక్తిగత వివరాలు, విద్యా సంబంధిత వివరాలు తప్పుగా నమోదు కావడం ఒక పెద్ద సమస్యగా మారుతోంది. పేరు, తండ్రి పేరు, గ్రూపు, మాధ్యమం, భాషా సబ్జెక్టులు వంటి కీలక అంశాల్లో తేడాలు రావడం వల్ల పరీక్ష సమయాన విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు.

గతంలో పరీక్ష కేంద్రాల్లోనే విద్యార్థులు ఓఎంఆర్ పత్రాల్లో తప్పులు సవరించుకునే అవకాశం ఉండేది. చాలా సందర్భాల్లో తెలుగు స్థానంలో హిందీ ముద్రించబడడం, గ్రూప్ మారడం, తల్లిదండ్రుల పేర్లు తప్పుగా రావడం వంటి సమస్యల్ని అప్పటికప్పుడు సరిచేసుకునే అవకాశం ఉండేది. అయితే ఈసారి పరీక్ష కేంద్రాల్లో అలాంటి అవకాశం ఉండదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

Also Read

  • Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
  • KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
  • Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
  • CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు

దీనికి బదులుగా, ఈ విద్యా సంవత్సరం నుంచి పరీక్షలకు ముందుగానే వివరాల సవరణకు అవకాశం కల్పించనుంది. ఇందుకోసం డీఐఈవోలకు మరియు కాలేజీ ప్రిన్సిపాళ్లకు బోర్డు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి కాలేజీ ప్రిన్సిపాళ్లు నామినల్ రోల్స్‌ను చూపించి, అందులో ఉన్న అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా కాలేజీలకు పిలిపించి వివరాలను క్రాస్ చెక్ చేయించి సంతకాలు తీసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియ ద్వారా ఓఎంఆర్ పత్రాల్లో వచ్చే పొరపాట్లను ముందుగానే పూర్తిగా నివారించవచ్చని బోర్డు భావిస్తోంది.

IBomma Ravi : మరో మూడురోజుల పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి

అంతేకాక, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్ కాలేజీల్లో చదువుతున్న దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు పరీక్షల ఫీజులు, గడువులు, నామినల్ రోల్స్ పరిశీలన, ప్రాక్టికల్స్ షెడ్యూల్ వంటి సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ల రూపంలో పంపించాలనే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పరీక్షల ఫీజు చెల్లించిన విద్యార్థులకు నవంబర్ 30 వరకు తమ నామినల్ రోల్స్‌లో ఉన్న పొరపాట్లను సవరించుకునే అవకాశం కల్పించింది. ఫీజు గడువు ముగిసిన తరువాత కూడా మరోసారి సవరణ అవకాశం ఇవ్వనున్నట్లు బోర్డు తెలిపింది.

ప్రస్తుతం 92% మంది విద్యార్థులు ఇప్పటికే పరీక్ష ఫీజులు చెల్లించడంతో, వివరాల ధృవీకరణ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ విధంగా, ఇంటర్ బోర్డు విద్యార్థుల వివరాలను ఖచ్చితంగా సరిచేసుకునే అవకాశం అందించి, పరీక్షల సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే నివారించడానికి చర్యలు చేపట్టింది.

Rabri Devi Bungalow: బరాబర్ బంగ్లా ఖాళీ చేయం.. అల్టిమేటం జారీ చేసిన ఆర్జేడీ!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Inter Exams 2025
  • Intermediate Board
  • Students Data Correction
  • telangana education

తాజావార్తలు

  • Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!

  • Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!

  • వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు

  • Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..

  • KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions