AP Inter Results 2024: ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఇదివరకే పూర్తయ్యాయి. మార్చి 1 నుండి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు వోకేషనల్ కోర్స్ తో కలిపి 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 52,900 విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వలేదు. 75 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ కు ప్రయత్నించారు. వీటికి సంబంధించి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇంటర్మీడియట్ సంబంధించిన ఇంటర్ సమాధాన పత్రాలు మూల్యాంకనం కూడా మొదలైంది. ఏప్రిల్ 4వ తేదీ నాటికి ఈ పేపర్ కరెక్షన్ పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పూర్తయిన వెంటనే ఏప్రిల్ 2 వారంలో ఫలితాలు విడుదల చేస్తున్నట్లు సమాచారం.
Also Read: SRH vs KKR: ఉత్కంఠపోరులో కేకేఆర్ గెలుపు.. క్లాసెన్ శ్రమ వృధా
Also Read
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
ఇక ఈసారి ఎన్నడూలేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22,000 కెమెరాలను ఉపయోగించి పరీక్షలను నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సిసిటీవీలను పరిక్షించెందుకు గుంటూరు జిల్లా తాడేపల్లి లోని బోర్డు కార్యాలయం కేంద్రంగా అధికారులు పనిచేశారు. మరోవైపు పరీక్ష పత్రాలు ఎక్కడ కూడా లీక్ కాకుండా ఉండేటట్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు అధికారులు. ముఖ్యంగా ఇందుకు సంబంధించి క్యూఆర్ కోడ్ లను జత చేసి పరీక్షలను నిర్వహించారు.
Also Read: Thug Life: కమల్- మణిరత్నం ‘సినిమా’ కష్టాలు!
ఇదివరకు పరీక్షల నిర్వహణ కోసం విద్యార్థుల నుంచి ఫీజు చెల్లింపులను చలానా రూపంలో విద్యార్థుల నుంచి తీసుకునేవారు. కాకపోతే., ఈ సంవత్సరం ఈ పద్ధతికి సెలవు చెప్పి ఆన్లైన్ విధానం తీసుకురావడంతో ఎలాంటి పొరపాట్లకు లోను కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు ఇంటర్ ప్రాక్టికల్ సంబంధించి కూడా అధికారులు సాంకేతికను ఉపయోగించి బోర్డు వెబ్సైట్లో అక్కడికక్కడే మార్కులను నమోదు చేయించారు. ఇక మార్కుల విషయంలో కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా రెండుసార్లు ఎగ్జామినర్ ఆన్లైన్లో నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?