జబల్పూర్ నుంచి హర్యానా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. ఫ్లైట్ను నాగ్పూర్కు దారి మళ్లించారు. బాంబు బెదిరింపు వచ్చిన విమానం.. ఇండిగో 6ఈ 7308గా గుర్తించారు. విమానాన్ని నాగ్పూర్లో ల్యాండ్ చేసి ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపారు. ఆ తరువాత.. వారికి అవసరమైన భద్రతా తనిఖీలు చేపట్టారు.
కోల్కతా నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానం కోల్కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సమాచారం ప్రకారం.. టేకాఫ్ తర్వాత, ఇండిగో విమానం 6E0573 యొక్క ఎడమ ఇంజిన్ లోపం కారణంగా విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది.
Vijayawada Airport: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి విజయవాడ మధ్య అనుసంధానం మరింత పెరుగుతోంది. ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో సంస్థ ప్రతిరోజు విమాన సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది.
వామ్మో.. రీల్స్ పిచ్చి ముదిరి పాకాన పడింది. ఇప్పటి దాకా రైళ్లు, విమానాశ్రాయాల్లోనే రీల్స్ చేయడం చూశాం. ఇప్పుడిది.. ఏకంగా విమానాన్ని ఆక్రమించింది. సోషల్ మీడియా వ్యామోహంలో పడిన కొందరు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు.
అసలే హస్తినలో అధిక ఉష్ణోగ్రతలు.. ఇంకోవైపు కరెంట్ కోతలు.. మరోవైపు తాగునీటి కష్టాలు.. ఇలా దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం రెండు గంటలు ఆగిపోయింది.
ఇండిగో విమానం రద్దవడంతో మదర్స్ డే రోజు తన అమ్మను కలవలేకపోయానని.. అనుభా పాండే అనే జర్నలిస్ట్ తెలిపారు. 11వ తేదీన ఉదయం 10.40 నిమిషాల విమానానికి ఢీల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ముంబాయి వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E5099) ఆలస్యం అయింది. మధ్యాహ్నం 2:30 గంటలకు ముంబై వెళ్లాల్సిన విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. విమానంలోని ఇంజన్ లో ఓవర్ హీట్ సమస్య రావడంతో ఏసీ సమస్య మొదలై.. విమానం అలస్యం అయింది.
ఇండిగో ఫ్లైట్లోని ఫుడ్ సెక్షన్ లో బొద్ధింకలు కనిపించడం తీవ్ర అలజడి రేపుతుంది. విమానంలో శుభ్రతను పాటించడం లేదని వాదన వినిపిస్తున్నాయి. తరుణ్ శుక్లా అనే ఓ ప్యాసింజర్ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు.
ఇండిగో ప్రయాణీకుడు తన బెంగళూరు నుండి చెన్నైకి వెళ్లే విమానంలో తన శాండ్విచ్లో స్క్రూను కనుగొన్నట్లు చెప్పడంతో ఇంటర్నెట్లో తుఫాను వచ్చింది. ఆహారంలో పురుగులు మరియు కీటకాలు కనిపించిన అనేక సంఘటనల మధ్య, ఈ సంఘటన విమానయాన ఆహార సేవల గురించి ఆందోళన కలిగించింది.. ఇప్పుడు మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.. ఓ ప్రయాణికుడు తింటున్న శాండ్విచ్ నట్ రావడంతో షాక్ అయ్యాడు.. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..…
గన్నవరం వచ్చిన ఇండిగో విమానం ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించింది. ల్యాండింగ్ అవుతున్న సమయంలో రన్ వే మీదకు వచ్చి.. మళ్లీ గాల్లోకి ఎగిరింది. దీంతో విమానం లోపల ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురైన ప్రయాణికులు.. బెంబెలెత్తిపోయారు. సరిగ్గా విమానం ల్యాండింగ్ సమయంలో వీల్ తెరుచుకోలేదు.