Indian Railways: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న మరోసారి నడిపించనుంది. తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-కోడంబాక్కం మధ్య ఈ రైలును నడిపించాలని రైల్వేశాఖ సన్నాహాలు నిర్వహిస్తోంది. ఈ లోకో ట్రైన్ను గతంలో హౌరా నుంచి ఢిల్లీ మధ్యలో అధికారులు నడిపించేవారు.…
ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ధ్యాంక్స్ అంటూ ట్వీట్ చేసారు. ఎప్పుడు బీజేపీపై ప్రశ్నల వర్షం, మండిపడే కేటీఆర్ థ్యాంక్స్ చెప్పడమేంటని చర్చనీయాంశంగా మారింది. అయితే కేటీఆర్ ప్రధానికి థ్యాంక్స్ అంటూ సెటైర్ విసిరారు. సీఎం కేసీఆర్కు కూడా ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్ . అయితే.. బండి సంజయ్ని ఈడీ చీఫ్గా నియమించిన ప్రధానికి కృతజ్ఞతలంటూ సెటైర్ వేసారు. అంతేకాకుండా.. దేశాన్ని…
Indian Railways cancelled grants to senior citizens: రైల్వే శాఖ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రైల్వే టికెట్ ధరపై వృద్ధులకు ఇచ్చే రాయితీని తొలగించింది. కోవిడ్ సమయంలో ఇండియన్ రైల్వే అన్ని రాయితీలు నిలిపివేసింది. వృద్ధులకు ఇచ్చే రాయితీని పునరుద్ధరించాలని ఇటీవల రైల్వేశాఖకు అనేక విజ్ఞప్తులు వచ్చాయి. ఈ మేరకు స్పందించిన రైల్వే శాఖ వృద్ధులకు రాయితీలను పునరుద్ధరించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. టిక్కెట్ రాయితీల గురించి పార్లమెంట్లో ఓ సభ్యుడు అడిగిన…
మనం ఉద్యోగం సంపాదన అంత సులువైన పనికాదు. అదికూడా ప్రభుత్వ ఉద్యోగమంటే తలకిందులుగా తపస్సు చేయవల్సిందే. కొన్ని సంవత్సరాలు కఠోర శ్రమ, రాత్రింబగళ్లు కష్టపడి చదివితే తప్ప.. ఉద్యోగం వరించదు. ఇవ్వన్నీ కాకుండా ఓ పది నెలల చిన్నారికి ఏకంగా రైల్వే ఉద్యోగం లభించింది. ఇది రైల్వే చరిత్రలోనే బహుశా తొలిసారి అనే చెప్పాలి. 10 నెలల చిన్న వయసు పసికందుకు ఉద్యోగం ఇవ్వడం ఇదే మొదటిసారి అయ్యి ఉంటుంది. అయితే ఈ చిన్నారికి రైల్వే ఉద్యోగం…
రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో క్యాటరింగ్ క్యాష్ లెస్ చెల్లింపులు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్లో క్యాటరింగ్తో సహా అన్ని స్టాల్స్లో నగదుకు బదులుగా డిజిటల్ పద్ధతిలో విక్రయిస్తారు. ఇలా చేయకుంటే రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు అధికారులు జరిమానా విధించనున్నారు. డిజిటల్ చెల్లింపుల కోసం విక్రేతలు తప్పనిసరిగా యూపీఐ,…
మౌలిక సదుపాయల ఆధునీకరణకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచ బ్యాంక్ చేయూత అందించనుంది. ఈ మేరకు 245 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1911 కోట్లు) రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంకు ముందుకొచ్చింది. ఏడేళ్ల గ్రేస్ పీరియడ్ సహా 22 ఏళ్లలో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. భారత్ చేపడుతున్న ‘రైల్ లాజిస్టిక్స్ ప్రాజెక్టు’కు ఈ నిధులు వినియోగించనున్నారు. సరకు రవాణా వేగవంతం, ప్రయాణికులను మరింత సురక్షితంగా, వేగంగా గమ్యం చేర్చడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ బ్యాంక్…
రైలు ప్రయాణం మధుర జ్ఞాపకం అంటూ ఎన్నో సినిమాల్లో సన్నివేశాలు చిత్రికరించారు. అయితే.. సీటు దొరికి ప్రయాణం హాయిగా సాగిపోతే అంతా మామూలే.. కానీ.. బెర్త్ రిజర్వేషన్ లేకపోతేనే కష్టం. అయితే.. ఏదేమైనా రైలు ప్రయాణంలో కొంత టెన్షన్ తప్పదు.. తాము దిగే స్టేషన్ వచ్చేసిందా.. ఇంకా ఎంతసేపట్లో దిగాల్సిన స్టేషన్ రాబోతోందో తెలియని కొన్ని సార్లు తికమక పడుతుంటారు. అయితే.. ఈ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది.…
బెర్త్ ఉన్న రైలు ప్రయాణం ఎంత బాగుంటుందో… బెర్త్ లేకుండా చేసే ప్రయాణం అంతే ఇబ్బందిగా ఉంటుంది. అయితే రైలులో బెర్త్ దొరికినా.. బాలింతలు చట్టిబిడ్డలతో అవస్థలు పడుతుంటారు. అంతేకాకుండా చిన్నపిల్లలు ఉన్న తల్లులు ఇబ్బందులు ఎదుర్కుంటారు. అయితే ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నపిల్లల కోసం రైల్వే శాఖ సీటును ప్రత్యేకంగా రూపొందించింది. ప్రయాణ సమయంలో తల్లులు పడుతున్న ఇబ్బందులను రైల్వే శాఖ దృష్టిలో పెట్టుకొని రైలులో ప్రత్యేక…
ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.. దీంతో విద్యుత్ వినియోగానికి భారీగా డిమాండ్ పెరిగింది.. కానీ, డిమాండ్కు సరిపడా విద్యుత్ సరఫరాను అందించే పరిస్థితి లేకుండా పోయింది.. అది కాస్తా విద్యుత్ కోతలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో కరెంటు ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది.. దీనికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున రైలు సర్వీసులను…