Minister KTR Thanks to PM Modi: ప్రధాని మోడీకి ధ్యాక్స్ చెప్పిన కేటీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ధ్యాంక్స్ అంటూ ట్వీట్ చేసారు. ఎప్పుడు బీజేపీపై ప్రశ్నల వర్షం, మండిపడే కేటీఆర్ థ్యాంక్స్ చెప్పడమేంటని చర్చనీయాంశంగా మారింది. అయితే కేటీఆర్ ప్రధానికి థ్యాంక్స్ అంటూ సెటైర్ విసిరారు. సీఎం కేసీఆర్కు కూడా ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్ . అయితే.. బండి సంజయ్ని ఈడీ చీఫ్గా నియమించిన ప్రధానికి కృతజ్ఞతలంటూ సెటైర్ వేసారు. అంతేకాకుండా.. దేశాన్ని నడుపుతున్న డబుల్ ఇంజిన్ మోదీ.. ఈడీ అని దీంతో అర్థమవుతున్నదని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వ్యగ్యంగా విమర్శించారు.
Dear @PMOIndia
Also Read
Thanks for appointing your BJP state president Sri BS Kumar as the Chief of ED also 👏👏
Now we realise double engine that runs this country is actually “Modi & ED” #ModiGovt pic.twitter.com/IlyOcbh9ty
— KTR (@KTRTRS) July 22, 2022
ఈనేపథ్యంలో.. సీనియర్ సిటిజన్లుతో పాటు.. జర్నిలిస్టులకు, విధ్యార్థులకు ఊహించని షాక్ ఇచ్చింది రైల్వేశాఖ. టికెట్ ధరపై సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీ కట్ చేయడమేకాకుండా.. విద్యార్థులు, జర్నలిస్టులకు వివిధ కోటాల్లో ఇస్తున్న సబ్సిడీలను మంగళం పాడింది. అయితే గతంలో అమలులో ఉండి ఇటీవలే కేంద్ర రైల్వే శాఖ తొలగించిన సబ్సిడీలపై కేంద్ర సర్కార్ తాజాగా తన అభిప్రాయాన్ని తెలిపి, సబ్సీడీలను తిరిగి పునరుద్దరించే అవకాశం లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో స్పదించిన మంత్రి కేటీఆర్.. రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీ ఎత్తివేత నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను మంత్రి కేటీఆర్ కోరారు. అయితే.. రాయితీ ఎత్తివేయాలన్న నిర్ణయం బాధాకరమని అన్నారు. పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యతే కాదు.. విధి కూడా అంటూ కేంద్ర మంత్రికి కేటీఆర్ ట్వీట్ చేశారు.
Dear @AshwiniVaishnaw Ji,
Taking care of our elderly people is not just a responsibility but our duty
Was saddened to read that Govt of India has decided to remove the senior citizen concession in train fares
Request you to review the decision & take a compassionate view pic.twitter.com/gkCWD3yI3q
— KTR (@KTRTRS) July 22, 2022
ఈనేపథ్యంలో.. దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, గిరిజనుల రిజర్వేషన్ల బిల్లు, అటవీ హక్కుల చట్ట సవరణ బిల్లు తమ హయాంలో ఆమోదం పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Many congratulations to Hon’ble Smt. Droupadi Murmu Ji on being elected as the 15th President of India 🇮🇳
I hope with your presidential assent, the much awaited Women’s reservation Bill, Tribal reservations enhancement in Telangana & RoFR amendment Bill will be cleared 🙏
— KTR (@KTRTRS) July 22, 2022
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!