VandeBharat Train Speed: వందే భారత్ రైలు ఘనత.. గంటకు 180 కి.మీ వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వేలు మరో ఘనతను సాధించాయి. వందే భారత్ పేరుతో సూపర్ ఫాస్ట్ ట్రైన్ సరికొత్త రికార్డు సృష్టించింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి కొత్త మైలురాయిని అందుకుంది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ట్వీట్ చేసి వివరాలను వెల్లడించారు. ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో తాజాగా ట్రైల్ రన్ రైల్వే శాఖ నిర్వహించింది. కోటా నుంచి మహిద్పూర్ రోడ్ స్టేషన్వరకు 180 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ దూసుకెళ్లింది. టెస్ట్ సమయంలోనే రైలులో వాషింగ్, క్లీనింగ్తో పాటు అన్ని పరికరాల పనితీరును పరిశీలించినట్టు రైల్వే మంత్రి తెలిపారు.

Also Read
- Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- Funeral Dance: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్లు.. అవాక్కైన నెటిజన్లు
- Shloka Mehta: ఇంటర్నెట్ను ఆకట్టుకున్న ముఖేష్ అంబానీ పెద్ద కోడలు సింప్ల్సిటీ.. వీడియో వైరల్
ఈ రైలును మొత్తం 16 కోచ్లతో ట్రైల్ నిర్వహించినట్టు వివరించారు. మంత్రి చేసిన ట్వీట్లో రైలు వేగాన్ని పరీక్షించే స్పీడో మీటరు పక్కనే గ్లాసు నిండా నీరున్నా ఒలకని వీడియోని మంత్రి ట్వీట్లో జతచేశారు. రైలు ఎంత స్పీడ్ వెళ్లినా నాణ్యత, భద్రతతో కూడిన ప్రయాణం అనుభూతి చెందవచ్చని రైల్వేమంత్రి తెలిపారు. సూపర్ రైడ్ క్వాలిటీ అంటూ మంత్రి కితాబిచ్చారు. వందే భారత్ రైళ్ల వేగంలో ధీటైనవి. వేగానికి తగ్గట్టుగా పటిష్టంగా వుండేలా ఈ రైళ్లను చాలా ప్రత్యేకంగా నిర్మించారు. ట్రయల్ కూడా హై లెవెల్లో పరీక్షిస్తున్నారు. ట్రైన్ స్పీడ్ ట్రయల్ తొలిదశలో 110 కిలోమీటర్లకు చేరుకుని అనంతరం రెండవ దశ ట్రయల్ రన్ లో గరిష్ట వేగం 180 కిలోమీటర్లకు చేరుకుంది.
Superior ride quality.
Look at the glass. Stable at 180 kmph speed.#VandeBharat-2 pic.twitter.com/uYdHhCrDpy— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 26, 2022
తాజావార్తలు
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
-
CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!