Vande Bharat Trains: సరికొత్త ఫీచర్లలో వందే భారత్ ట్రైన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Advanced Features In New Vande Bharat Trains: భారతీయ రైల్వేలు మరింత ఆధునాతనంగా తయారు అవుతున్నాయి. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారతీయ రైల్వేలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా వందే భారత్ ట్రైన్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు కొత్తగా తీసుకురాబోతున్న వందే భారత్ 2 ట్రైన్లలో మరిన్ని కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టబోతోంది. భారత దేశంలో వేగంగా ప్రయాణించే రైళ్లుగా వందే భారత్ రైళ్లకు పేరుంది. ఇప్పుడు ఆ స్పీడును మరింత తక్కువ సమయంలో అందుకునేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. వందే భారత్ 2 ప్రయాణికులకు అత్యుత్తమమైన, అప్గ్రేడ్ చేసిన సౌకర్యాలను అందిస్తుంది. ఆగస్టు 2023 నాటికి 75 వందే భారత్ రైళ్లను తయారు చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: Errabelli Dayakar Rao: అసోం సీఎంపై ఫైర్.. ఆయన వల్లే హైదరాబాద్లో ఉద్రిక్తత
Also Read
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
వందే భారత్ 2 కేవలం 52 సెకన్లలో 0 నుంచి గంటలకు 100 కిలోమీటర్ల స్పీడును అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. కొత్త వందేభారత్ 2 ట్రైన్లు 130 సెకన్లలో 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నాయి. గతంలో ఇది 146 సెకన్లుగా ఉండేది. బరువు 430 టన్నుల నుంచి 392 టన్నులకు తగ్గించనున్నారు. దీంతో పాటు డిమాండ్ పై వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నారు. కొత్త వందేభారత్ ట్రైన్లలో 24 అంగుళాల ఎల్సీడీ టీవీకి బదులు 32 అంగుళాల ఎల్సీడీ టీవీని తీసుకురానున్నారు. 15 శాతం ఎక్కవ ఎనర్జీ ఎఫెక్టివ్ ఏసీలతో పాటు డస్ట్ ఫ్రీ క్లీన్ ఎయిర్ కూలింగ్ ట్రాక్షన్ మోటర్ వంటి ఫీచర్లను వందే భారత్ 2 ట్రైన్లలో తీసుకురానున్నారు.
ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణికులకు అందిస్తున్న సైడ్ రిక్లైనర్ సీటు సౌకర్యాన్ని.. కొత్త వందే భారత్ ట్రైన్లలో అన్ని తరగతుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. వందే భారత్ ట్రైన్ కొత్త డిజైన్లలో ఎయిర్ ప్యూరిఫైయర్ కోసం రూఫ్ మౌంటైడ్ ప్యాకేజీ యూనిట్(ఆర్ఎంపీయూ)లో అల్ట్రా వైలెట్ ఎయిర్ ప్యూరిఫికేషణ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఓ) సిఫార్సుల ప్రకారం.. రైల్ లో స్వచ్ఛమైన గాలితో పాటు బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను ఫిల్టర్ చేసే విధంగా ఆర్ఎంపీయూ సిస్టమ్ రాబోతోంది.
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
-
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
-
Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..