Vande Bharat Trains: సరికొత్త ఫీచర్లలో వందే భారత్ ట్రైన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Advanced Features In New Vande Bharat Trains: భారతీయ రైల్వేలు మరింత ఆధునాతనంగా తయారు అవుతున్నాయి. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారతీయ రైల్వేలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా వందే భారత్ ట్రైన్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు కొత్తగా తీసుకురాబోతున్న వందే భారత్ 2 ట్రైన్లలో మరిన్ని కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టబోతోంది. భారత దేశంలో వేగంగా ప్రయాణించే రైళ్లుగా వందే భారత్ రైళ్లకు పేరుంది. ఇప్పుడు ఆ స్పీడును మరింత తక్కువ సమయంలో అందుకునేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. వందే భారత్ 2 ప్రయాణికులకు అత్యుత్తమమైన, అప్గ్రేడ్ చేసిన సౌకర్యాలను అందిస్తుంది. ఆగస్టు 2023 నాటికి 75 వందే భారత్ రైళ్లను తయారు చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: Errabelli Dayakar Rao: అసోం సీఎంపై ఫైర్.. ఆయన వల్లే హైదరాబాద్లో ఉద్రిక్తత
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
వందే భారత్ 2 కేవలం 52 సెకన్లలో 0 నుంచి గంటలకు 100 కిలోమీటర్ల స్పీడును అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. కొత్త వందేభారత్ 2 ట్రైన్లు 130 సెకన్లలో 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నాయి. గతంలో ఇది 146 సెకన్లుగా ఉండేది. బరువు 430 టన్నుల నుంచి 392 టన్నులకు తగ్గించనున్నారు. దీంతో పాటు డిమాండ్ పై వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నారు. కొత్త వందేభారత్ ట్రైన్లలో 24 అంగుళాల ఎల్సీడీ టీవీకి బదులు 32 అంగుళాల ఎల్సీడీ టీవీని తీసుకురానున్నారు. 15 శాతం ఎక్కవ ఎనర్జీ ఎఫెక్టివ్ ఏసీలతో పాటు డస్ట్ ఫ్రీ క్లీన్ ఎయిర్ కూలింగ్ ట్రాక్షన్ మోటర్ వంటి ఫీచర్లను వందే భారత్ 2 ట్రైన్లలో తీసుకురానున్నారు.
ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణికులకు అందిస్తున్న సైడ్ రిక్లైనర్ సీటు సౌకర్యాన్ని.. కొత్త వందే భారత్ ట్రైన్లలో అన్ని తరగతుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. వందే భారత్ ట్రైన్ కొత్త డిజైన్లలో ఎయిర్ ప్యూరిఫైయర్ కోసం రూఫ్ మౌంటైడ్ ప్యాకేజీ యూనిట్(ఆర్ఎంపీయూ)లో అల్ట్రా వైలెట్ ఎయిర్ ప్యూరిఫికేషణ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఓ) సిఫార్సుల ప్రకారం.. రైల్ లో స్వచ్ఛమైన గాలితో పాటు బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను ఫిల్టర్ చేసే విధంగా ఆర్ఎంపీయూ సిస్టమ్ రాబోతోంది.
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..