Indian Railways: మళ్లీ పట్టాలెక్కిన 1855 నాటి పురాతన రైలు.. కారణం ఏంటంటే..?
Indian Railways: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న మరోసారి నడిపించనుంది. తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-కోడంబాక్కం మధ్య ఈ రైలును నడిపించాలని రైల్వేశాఖ సన్నాహాలు నిర్వహిస్తోంది. ఈ లోకో ట్రైన్ను గతంలో హౌరా నుంచి ఢిల్లీ మధ్యలో అధికారులు నడిపించేవారు. ఈ నేపథ్యంలో ఈ ట్రైన్ ట్రయల్ రన్ను తాజాగా రైల్వే శాఖ నిర్వహించింది.
Read Also: National Lazy day: బద్దకం మంచిదే కానీ.. అతి బద్దకం యమ డేంజర్
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
EIR-21 రైలు అతి పురాతనమైనది. 1855లో ఈ రైలును ఇంగ్లండ్లో తయారుచేశారు. ఈ రైలు ఆవిరితో నడుస్తుంది. బ్రిటీష్ పాలనలో 1909 వరకు ఈ రైలును అధికారులు నడిపించారు. స్వాతంత్ర్యం వచ్చాక ఈ రైలును హౌరాలోని జమాల్పూర్లో ప్రజల సందర్శనార్థం కోసం ఉంచారు. ప్రపంచంలోని ఇది అతి పురాతన రైలు అని చెప్పడానికి దీనిని ప్రదర్శన కోసం హౌరాకు ఈ రైలును తరలించారు. ప్రస్తుతం చెన్నై మెట్రో సిటీ పెరంబూర్ లోకోమోటివ్ వర్క్స్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ రైలును గణతంత్ర దినోత్సవం లేదా స్వాతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలలో బయటకు తీసుకువచ్చి చరిత్రను ప్రజలకు చాటి చెప్పేందుకు నడిపిస్తుంటారు.
The trial run of the 1855 manufactured EIR-21, which was the first loco to haul a train from Howrah to Delhi in 1866. There will be a run on August 15th on the occasion of #AzadiKaAmritMahotsav! #IndianRailways #heritage pic.twitter.com/1U3DnhOP0p
— Ananth Rupanagudi (@Ananth_IRAS) August 9, 2022
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!