Kishan Reddy: భారత్-బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి చారిత్రాత్మక ఒప్పందంగా నిలిచిపోతుంది అన్నారు.
పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఉంది. అయితే అది ఎలా అనే విషయంలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. ఇప్పటికే భారత్ వ్యూహాత్మక యుద్దం మొదలుపెట్టింది. కానీ కొందరు సోషల్ మీడియా దేశ భక్తులు మాత్రం పాక్ పై అణుదాడికి దిగాలని ఉచిత సలహాలిస్తున్నారు. ఇంతకూ భారత్ ఏం చేస్తే బాగుంటుంది..? అసలు పాక్ పరిస్థితి ఎలా ఉంది..? అణ్వస్త్రాల విషయంలో దాయాదుల వైఖరేంటి..?
Khalistan Terrorist: కెనడా దేశంలో ఖలిస్థానీలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఆ దేశం నుంచి 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ వేర్పాటు వాదులు టొరొంటోలోని మాల్టన్ గురుద్వారాలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి మృతుడి భార్యను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా మండిపడింది. ఆమె సైద్ధాంతిక వ్యక్తీకరణను తప్పుపడుతూ ట్రోల్ చేయడం మంచిది కాదని తెలిపింది.
బైసారన్ లోయలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక నేపాలీ జాతీయుడితో సహా ఇరవై ఆరు మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన టెర్రరిస్టులను పట్టుకునేందుకు భారత భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ ఘోరమైన కాల్పులకు పాల్పిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నత సైనిక శిక్షణ పొందారని నిఘా వర్గాలు తెలిపాయి.
Pakistan: జమ్ము కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ దాడిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇండియా ప్రకటించింది. ఈ క్రమంలో దాయాది దేశం కవ్వింపు చర్యలకు దిగుతుంది.