ఆపరేషన్ సిందూర్పై దాయాది దేశాధినేతలు ఒక్కొక్కరు నోరు విప్పితున్నారు. తాజాగా పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్లోని కీలకమైన వైమానిక స్థావరాలను భారతదేశం ధ్వంసం చేసిందని ఇషాక్ దార్ అంగీకరించారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద దృశ్యాలు.. ఇంకా కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా మృతదేహాల అప్పగింత కూడా పూర్తికాలేదు. ఈలోపే మళ్లీ మళ్లీ విమానాల్లో లోపాలు బయటపడుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు.. గాల్లో దీపాలుగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్న భయం.. విమానం ఎక్కే వారిలో కనిపిస్తోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ? లోపాలు ఎక్కడ ఉన్నాయి ? విమానాల్లో సాంకేతిక సమస్యాలా లేక నిర్వహణలో రూల్స్ పాటించకపోవడమా ?
కెనడాలో జరుగుతున్న జీ 7 శిఖరాగ్ర సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని మోడీ-ఇటలీ ప్రధాని మెలోని కలుసుకున్నారు. దీంతో ఇద్దరి కలిసి కరచాలనం చేసుకున్నారు. చాలా సేపు షేక్హ్యాండ్ ఇచ్చుకుంటూ.. ఇద్దరు నవ్వుకుంటూ సంభాషించుకున్నారు.
ప్రధాని మోడీ జీ 7 శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకు కెనడా వెళ్లారు. జీ 7 సమ్మిట్లో ఉన్న దేశాధినేతలంతా సమావేశానికి హాజరయ్యారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు మోడీ కూడా కెనడా వెళ్లారు.