Assembly Bypoll Result 2025: గుజరాత్లో ఆప్, కేరళలో కాంగ్రెస్ విజయం
- 4 రాష్ట్రాల్లో వెలువడిన అసెంబ్లీ బైపోల్స్ ఫలితాలు
- గుజరాత్లో ఒక్కొక్క స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ, ఆప్
- కేరళలో కాంగ్రెస్ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. గుజరాత్లో రెండు స్థానాలకు బైపోల్స్ జరిగాయి. విశావదర్, కడి రెండు స్థానాలకు కౌంటింగ్ నిర్వహించారు. తాజా ఫలితాల్లో బీజేపీ ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇక కేరళలోని నీలంబర్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్లోని లూథియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్లోని కలిగంజ్ స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో జూన్ 19న పోలింగ్ జరిగింది.
ఇది కూడా చదవండి: OPPO K13x 5G: అసలు మిస్ అవ్వద్దు.. కేవలం రూ. 11,999లకే 6000mAh భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఫీచర్లతోపాటు మరెన్నో ..
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఆయా పార్టీల అభ్యర్థులు విజయం దిశగా సాగిపోయారు. విశావదర్లో ఆప్ అభ్యర్థి గోపాల ఇటాలియా విక్టరీ సాధించగా.. కడిలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ నిలంబూర్ నియోజకవర్గంలో విజయం సాధించింది. ఇక భారత ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ప్రకారం… అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్.. లూథియానా వెస్ట్లో కూడా ముందంజలో ఉంది. ఇక మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్.. కాలిగంజ్లో విజయం దిశగా వెళ్తోంది. గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్లలో ఒక్కొక్క స్థానంలో ప్రస్తుత శాసనసభ్యులు మరణించగా.. కేరళ, గుజరాత్లో ఇద్దరు శాసనసభ్యులు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఇది కూడా చదవండి: Phone Tapping : కొత్త మలుపు.. మాజీ సీఎస్ శాంతికుమారి స్టేట్మెంట్ రికార్డ్
కేరళలోని నిలంబూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్యదాన్ షౌకత్ను ప్రియాంక అభినందించారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) దార్శనికతపై నమ్మకం ఉంచినందుకు నిలంబూర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మద్దతుతో ఆర్యదాన్ షౌకత్… పార్టీని ముందుకు నడిపించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక గుజరాత్లో ఆప్ విజయం సాధించడం పట్ల ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచుతుందన్నారు. ఇక పంజాబ్లో కూడా విజయానికి దగ్గరగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రతి కార్యకర్తకు సంతోషకరమైన విషయంగా తెలిపారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!