Home
India
India News
-
ట్విట్టర్పై కేంద్రం సీరియస్…
కొత్త నిబంధనలు ఇప్పుడు భారత ప్రభుత్వం, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మధ్య వివాదానికి దారి తీశాయి.. ఇక, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం వుందన్నట్విట్టర్ చేసిన వ్యాఖ్యలను మరింత దుమారాన్నే రేపుతున్నాయి.. దీనిపై కేంద్ర ఐటీశాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. ట్విట్టర్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రం.. ఇది, ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలుగా ఐటీ శాఖ వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి.. ఇప్పుడు ట్విట్టర్ పాఠాలు నేర్పుతోందని ఫైర్ అయ్యింది… -
ఉద్యోగులపై వ్యాక్సినేషన్పై రిలయన్స్ కీలక నిర్ణయం
అపరకుభేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్… తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.. తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు.. వారి కుటుంబ సభ్యులు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ఈ కార్పొరేట్ దిగ్గజం నిర్ణయానికి వచ్చింది.. దీని కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనుంది.. రిలయన్స్తో పాటు.. దాని అనుబంధ, భాగస్వామ్య సంస్థల్లో పనిచేస్తున్న 13 లక్షల మంది సిబ్బందికి… -
భారత్ కొత్త ఐటి నిబంధనలపై స్పందించిన గూగుల్… స్థానిక చట్టాలకు అనుగుణంగా…
సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాల ప్రకారం దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు ఎలాంటి భంగం కలిగించే విధంగా పోస్టులు పెడితే వాటి వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ చట్టం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టాలను గౌరవిస్తామని, ఏ దేశంలో కార్యకలాపాలు సాగించినా, అక్కడి స్థానిక చట్టాలకు అనుగుణంగా పని చేస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కోన్నారు. భారత్లో స్వేచ్చాయుత… -
మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు..తెలుగు రాష్ట్రాలలో సెంచరీకి చేరువలో
కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. పెట్రో ధరలు పెరుగుదల సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి.. కానీ, ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిందో.. అప్పటి నుంచి ఆగిపోయాయి.. కొన్ని సార్లు తగ్గాయి తప్పితే.. పెరిగింది మాత్రం లేదు.. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్… -
ఇండియా కరోనా అప్డేట్.. 24 గంటలలో 2,11,298
భారత్ లో రెండవ విడత “కరోనా” వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. మరోసారి 2 లక్షలకు పైగా నమోదయ్యాయి రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య. పాజిటివ్ కేసులు తగ్గినా….“కరోనా” మరణాలు ఆగడం లేదు. దేశంలో గడచిన 24 గంటలలో 2,11,298 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు కాగా…3,847 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,83,135 కాగా…దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,69,093 కు… -
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష వాయిదా.. అదే కారణం..
కరోనా సెకండ్ వేవ్ కల్లోలంతో వివిధ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన కామన్ టెస్టులు, ఇతర పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.. ఇప్పటికీ కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది.. దీంతో.. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఐఐటీ ఖరగ్పూర్ ఓ ప్రకటన విడుదల చేసింది.. షెడ్యూల్ ప్రకారం జులై 3వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగాల్సి ఉండగా.. కోవిడ్ కల్లోలం కొనసాగుతున్నందున.. ప్రస్తుతం నిర్వహించలేకపోతున్నామని వెల్లడించింది..… -
వ్యాక్సిన్ వృధా… ఆ రాష్ట్రాల్లోనే అత్యధికం…
దేశంలో ఒకవైపు కరోనా వ్యాక్సిన్ కొరత ఎదుర్కొంటుండగా, మరోవైపు వ్యాక్సిన్ ఎక్కువగా వృధా అవుతున్నది. వ్యాక్సిన్ వృధా ఒక్కశాతం కంటే తక్కువ ఉండేలా చూడాలని కేంద్ర ఆరోగ్యశాఖ పదేపదే రాష్ట్రాలను హెచ్చరిస్తున్నా, వృధా ఏమాత్రం తగ్గడంలేదు. వ్యాక్సిన్ వృధా చేస్తున్న రాష్ట్రాల్లో ఝార్ఖండ్లో 37.3 శాతం, చత్తీస్ గడ్లో 30.2 శాతం వృధా చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇకపోతే, తమిళనాడులో 15.5శాతం, జమ్ముకాశ్మీర్లో 10.8శాతం, మధ్యప్రదేశ్లో 10.7శాతం టీకాలు వృధా అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. ఇక… -
ఇండియా కరోనా అప్డేట్
కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 2,08,921 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,71,57,795 కి చేరింది. ఇందులో 2,43,50,816 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 24,95,591 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 4,157 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,11,388 కి చేరింది. ఇక ఇదిలా… -
130 రోజుల్లో 20 కోట్ల డోసులు….
కరోనా మహమ్మారికి టీకాలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. మనదేశంలో జనవరి 16 వ తేదీ నుంచి టీకాలను అందుబాటులో ఉంచారు. మంగళవారానికి 130 రోజులు ఆయింది. 130 రోజుల వ్వవధిలో 20 కోట్లమందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 20,04,94,991 మందికి వ్యాక్సిన్ అందించారు. 15,69,99,310 మందికి మొదటి డోసు వ్యాక్సిన్ అందించగా, 4,34,95,981 మందికి రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్ను అందించారు. దేశంలో జూన్ నెల నుంచి ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్లు… -
కేంద్రం నిబంధనలకు తలొగ్గిన ఫేస్బుక్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలకు తలొగ్గింది ఫేస్బుక్.. ప్రజలు స్వేచ్ఛగా, సురక్షితంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగలిగే వేదికగా ఉపయోగపడేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది.. ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది.. అయతే, మరికొన్ని నిబంధనలపై చర్చ జరుగుతోందని.. ఈ విషయంలో ప్రభుత్వంతో మరిన్ని సమావేశాలు జరగవలసి ఉందని వెల్లడించింది.. కాగా, కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం సామాజిక మాధ్యమాల సంస్థలు చీఫ్ కాంప్లియెన్స్ అండ్ గ్రీవియెన్స్ ఆఫీసర్స్ను…
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!