ఇండియాలో కరోనా జోరు కొంచెం తగ్గుతుంది. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,67,334 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,54,96,330 కి చేరింది. ఇందులో 2,19,86,363 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 32,26,719 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 4,529 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,83,248కి చేరింది. ఇక 24…
హైదరాబాద్ ఫార్మా హబ్ గా మారిన సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ లు కరోనా టీకా కేంద్రాలుగా మారాయి. ఇప్పుడు బయోలాజికల్ ఈ సంస్థ సొంతంగా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ దశలో ఉన్నది. ఇకపోతే, ఈ వ్యాక్సిన్ తో పాటుగా అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ ను కూడా బయోలాజికల్ ఈ సంస్థ ఉత్పత్తి చేసేందుకు…
కరోనాను చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. భారత్లో ఇప్పటి వరకు రెండు వ్యాక్సిన్లే అందుబాటులో ఉండగా.. త్వరలోనే మరిన్ని టీకాలు అందుబాటులోకి రానున్నాయి.. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు వేస్తుండగా… వ్యాక్సినేషన్పై కోవిషీల్డ్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది.. దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి టీకాలు ఎగుమతి చేయలేదని స్పష్టం చేశారు.. ఆ సంస్థ చీఫ్ అదర్ పూనవల్లా. దేశంలో వ్యాక్సినేషన్కు సహకరించేందుకు కట్టుబడి ఉన్నామని…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు మూడు లక్షల లోపే కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,63,533కి చేరింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,52,28,996కి చేరింది. ఇందులో 2,15,96,512 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 33,53,765 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో ఇండియాలో 4329…
కరోనాను కట్టడి చేయడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పుడు ప్రజల్లో వ్యాక్సిన్పై అవగాహన పెరిగినా.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన మొదట్లో.. ఆది తీసుకోవడానికి వెనుకడుగు వేసినవారు ఎందరో.. ఇప్పటికీ చాలా మందిలో వ్యాక్సిన్ భయం లేకపోలేదు. దీనికి ప్రధాన కారణం.. వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.. మళ్లీ కోవిడ్ బారిన పడుతున్నారు.. వ్యాక్సినేషన్ తర్వాత కొందరు ప్రాణాలే కోల్పోయారు.. ఇలా అనేక వార్తలు హల్ చల్ చేశాయి.. అయితే, భారత్లో వ్యాక్సిన్లతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్…
దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువవుతోంది. సెకండ్ వేవ్ తో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే వుంది. కాగా ఫ్రంట్ వారియర్స్ గా పోరాడుతున్న డాక్టర్లు కూడా మృత్యువాత పడటం కలిచివేస్తుంది. కరోనా మొదటి వేవ్లో 730 మంది డాక్టర్లు మృతి చెందగా, సెకండ్ వేవ్లో ఇప్పటి వరకు 244 మంది వైద్యులు మృతి చెందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే సెకండ్ వేవ్లో 69 మంది డాక్టర్ల…
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పాజిటీవ్ కేసులు గత రెండు రోజులుగా తగ్గుతున్నా మరణాల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ప్రజలను హెచ్చరిస్తోంది. తాజాగా దేశంలో 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,49,65,463కి చేరింది. ఇందులో 2,11,74,076 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 35,16,997 కేసులు ఇంకా యాక్టీవ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 4,106 మంది మృతి…
చైనాలో పుట్టిన కరోనా వైరస్ విజృంభణ ఇండియాలోనూ కొనసాగుతోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, నిన్నటి కంటే స్వల్పంగా కేసులు తగ్గాయి. తాజాగా దేశంలో 3,11,170 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,46,84,077 కి చేరింది. ఇందులో 2,07,95,335 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,18,458కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 4,077 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో…
కరోనా కట్టడికి భారత్లో వ్యాక్సినేషన్ వీలైనంత వేగంగా కొనసాగించాలని సర్కార్ భావిస్తున్నా… టీకాల కొరత మాత్రం వెంటాడుతూనే ఉంది.. ఈ నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సినేషన్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రారంభంకాని పరిస్థితి. అయితే.. ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు.. కోవిషీల్డ్, కోవాగ్జిన్తో పాటు.. రష్యా టీకా కూడా భారత్కు చేరుకోగా.. ఇప్పుడు భారత్కు వ్యాక్సిన్ల పంపిణీపై కీలక ప్రకటన చేసింది అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్..…