కొలంబో వేదికగా ఇండియా, శ్రీలంక జట్ల మధ్య మూడో టీ 20 మ్యాచ్ జరుగుతున్నది. ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే, మ్యాచ్ మొదలైనప్పటి నుంచి వరసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 81 పరుగులు మాత్రమే చేసింది. 2008లో ఆస్ట్రేలియాపై చేసిన 74 పరుగుల అత్యల్ప స్కోరు తరువాత ఇదే రెండో అత్యల్ప స్కోర్ కావడం విశేషం. 36 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన టీం ఇండియాను టేలెండర్లు ఆదుకున్నారు. కులదీప్ యాదవ్ 23 పరుగులు, భువనేశ్వర్ కుమార్ 16 పరుగులు చేయడంతో 81 పరుగులు చేయగలిగింది. శ్రీలంక స్పిన్నర్ హసరంగ 9 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోగా, డాసున్ శనక 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు.
Read: పోలీస్ కమీషనర్కు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీలో తీర్మానం… ఎందుకంటే…