జూన్ లో న్యూజిలాండ్తో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ అనంతరం భారత జట్టు అక్కడే ఉండి ఆగస్టులో ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. దాదాపు నెలరోజుల పాటు భారత ఆటగాళ్లు ఖాళీగా ఉండనున్నారు. అయితే ఈ గ్యాప్లో బీసీసీఐ మరో టూర్ను ప్లాన్ చేసింది. గతంలో కరోనా కారణంగా వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది. ఈ పర్యటనలో భారత్.. ఆతిథ్య శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. కోహ్లీ…
ఇండియాలో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు వ్యాక్సిన్ అందిస్తున్నారు. వ్యాక్సిన్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇండియాలో కరోనా మహమ్మారికి అత్యవసర సమయంలో రెమ్ డెసివీర్ వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ను ఇండియాలో సిప్లా ఫార్మా తయారు చేస్తున్నది. రెండు రోజుల క్రిత్రం రోచ్ సంస్థ తయారు చేసిన యాంటీబాడీ కాక్ టైల్ మెడిసిన్ ను కూడా ఇండియాలో సిప్లా కంపెనీ పంపిణి చేయబోతున్నది. ఇకపోతే, ఇప్పుడు మరో ఔషధానికి ఇండియాలో…
భారత్ లో కరోనా మహమ్మారి ఎంతగా విజృంభిస్తోందో చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి ఇప్పటికే మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అటు గుజరాత్ కు చెందిన జైకోవ్ డి వ్యాక్సిన్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇక ఇదిలా ఉంటె ఇప్పుడు మరో ఔషధాన్ని ఇండియా డ్రగ్స్ కంట్రోల్ అనుమతులు మంజూరు చేసింది. యాంటీబాడీ కాక్ టైల్ ఔషధం త్వరలోనే ఇండియాకు దిగుమతి కానున్నది. ఈ ఔషధాన్ని గతంలో ట్రంప్ వినియోగించారు. అమెరికా అధ్యక్ష…
దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక దక్షిణభారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో పరిస్థతి వేరుగా ఉన్నది. రోజుకు 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క బెంగళూరు నగరంలోనే ఏకంగా 25 వేలకు పైగా కేసులు, 200 లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని, లేదంటే కర్ణాటక రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు పెనుముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తెలియజేసింది.…
“కోవిడ్-19” విపత్తు నేపథ్యంలో ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. “రెండవ విడత” కరోనా విపత్తులో దేశం విలవిల్లాడుతోందని..ఎలాగైనా సరే ప్రజల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ప్రతి ఆరుగురి “కోవిడ్” బాధితుల్లో, ఒకరు భారతీయుడు ఉన్నాడని లేఖలో పేర్కొన్నారు. దేశ జనాభా, జనసాంద్రత నేపథ్యంలో వైరస్ శరవేగంగా అనేక రూపాంతరాలతో విజృంభిస్తోందని.. నియంత్రణ లేకుండా వైరస్ను వదిలేయడం వల్ల దేశానికే కాదు, ప్రపంచానికి కూడా ముప్పు అని పేర్కొన్నారు. వైరస్ రూపాంతరాలపై “జీనోమ్…
ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో కొత్తగా 4,14,188 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,14,91,598కి చేరింది. ఇందులో 1,76,12,351 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,45,164 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24గంటల్లో ఇండియాలో కరోనాతో 3915 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,34,083కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24…
ఇండియాలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉధృతం అవుతున్నది. రోజువారీ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 4,12,262 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,10,77,410కి చేరింది. ఇందులో 1,72,80,844 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 35,66,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 3,980 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన…
ఇండియాలో రోజురోజుకు కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య వేలల్లో ఉంటోంది. దీంతో ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ జాబితాలో పోలెండ్ కూడా చేరిపోయింది. ఇండియా నుంచి పోలెండ్కు వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ ను తప్పనిసరి చేసింది. 14 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని పోలెండ్ ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే పోలెండ్ దౌత్యవేత్తల కుటుంబం ఇండియా నుంచి పోలెండ్కు చేరుకుంది. పోలెండ్కు చేరుకున్న దౌత్యవేత్తల కుటుంబానికి…
ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి తీవ్రంగా ఉన్నది. రోజువారీ కేసులు మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 3,82,315 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,65,148 కి చేరింది. ఇందులో 1,69,51,731 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,87,229 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 3780 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో…
దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. అయితే, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలని డిమాండ్ పెరుగుతున్నది. సర్వేలు కూడా ఇదే విషయాన్నీ స్పష్టం చేస్తున్నాయి. ఈ సమయంలో లాక్ డౌన్ పై రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల వలనే దేశంలో కరోనా మహమ్మారి…