భారత్లో కరోనాకు వ్యతిరేకంగా పిల్లలకు కోవోవాక్స్ టీకాలు వేయాల్సి ఉంటుందన్నారు అదర్ పునావాలా. కోవోవాక్స్ టీకా ఆరు నెలల్లో అందుబాటులో ఉంటుందని, ప్రస్తుతం ట్రయల్స్ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి భద్రతా పరమైన సమస్యలు ఉత్పన్నం కాలేదని స్పష్టం చేశారు. కోవోవాక్స్తో రెండేళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడం తమ విధానమన్నారు. కోవోవాక్స్ వ్యాక్సిన్ స్టాక్ భారీగానే ఉందని, డ్రగ్ నియంత్రణ సంస్థల ఆమోదం పొందిన తర్వాతే…. భారత్తో పాటు ప్రపంచానికి అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా టీకా…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. దక్షిణాఫ్రికా నుంచి వివిధ దేశాలకు వ్యాపించింది. దీంతో యూరప్ దేశాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించారు. ఇజ్రాయిల్ దేశం సరిహద్దులు మూసివేసింది. జపాన్లో మొదటి కేసు నమోదు కావడంతో ఆందోళన మొదలైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలంతో కేంద్రం కొత్త రూల్స్ను తీసుకొచ్చింది. రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పని సరిగా ఎయిర్పోర్ట్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆర్టీపీసీఆర్ రిజల్ట్ వచ్చేవరకు వారు ఎయిర్పోర్ట్లోనే…
న్యుజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ వచ్చే నెల 7న ముగిసిన తర్వాత భారత జట్టు 8 లేదా 9న సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళాల్సి ఉంది. అయితే అక్కడ ప్రస్తుతం ఓమిక్రాన్ అనే కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తుంది. ఈ క్రమంలో టీం ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటన ఉంటుందా. లేదా అనే విషయం పై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ తాజాగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాలో పరిస్థితి ఇంకా తీవ్రతరం కాకపోతే…
ఆఫ్ఘనిస్థాన్కు భారత్ సాయం అందించేందుకు పాకిస్తాన్ తన షరతుల జాబితాను భారత్కు పంపించింది. ఆఫ్ఘనిస్తాన్కు మానవతా సహాయంగా వాఘా ద్వారా 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు,ప్రాణాలను రక్షించే మందులను రవాణా చేయడాన్ని అనుమతిస్తున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ నిబంధనలు విధించింది. ఇప్పుడు ఇస్లామాబాద్ పెట్టిన రెండు షరతులు భారత్కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకటి, సామాగ్రిని పాకిస్తానీ ట్రక్కుల ద్వారా రవాణా చేయాలని పాక్ పట్టుబడుతుంది. భారతీయులు కాకపోతే కనీసం ఆఫ్ఘన్ ట్రక్కులు మెటీరియల్ని ఆఫ్ఘనిస్తాన్కు…
న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో భారత జట్టు చివరి వరకు కష్టపడినా అది డ్రా గా ముగిసింది. కివీస్ జట్టు ఆఖరి బ్యాటర్లు వికెట్ కోల్పోకుండా అడ్డుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో 4వ రోజు టీం ఇండియా డిక్లర్ చేసిన సమయం కంటే కొంచెం ముందు డిక్లర్ చేస్తే ఫలితం మరోలా ఉండేది అని చాలా వార్తలు వచ్చాయి. అయితే దీని పై స్పందించిన భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ……
ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా దక్షిణాఫ్రికాలో పరిస్థితులు అంతబాగా లేవు. ఆ కారణంగానే అక్కడ దక్షిణాఫ్రికా , నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ వాయిదా పడింది. ఈ క్రమంలో వచ్చే నెలలో అక్కడికి వెళ్లనున్న భారత పర్యటన పై ప్రశ్నలు వచ్చాయి. టీం ఇండియాను బీసీసీఐ దక్షిణాఫ్రికాకు పంపాలంటే మమల్ని సంప్రదించాలి అని భారత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అందుకు ఒప్పుకున్న బీసీసీఐ జట్టును దక్షిణాఫ్రికా పంపాలనే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక…
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో భారత్ను పాకిస్థాన్ అధిగమించింది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ ఖాతాలో 12 పాయింట్లు చేరడంతో ఆ జట్టు మొత్తం పాయింట్ల సంఖ్య 24కి చేరింది. బంగ్లాదేశ్పై టెస్టు గెలిచిన తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ రెండో స్థానానికి చేరుకుంది. అయితే పాకిస్థాన్ కంటే భారత్కు ఎక్కువ పాయింట్లు ఉన్నా విన్నింగ్ పర్సంటేజీలో మాత్రం వెనుకబడి…
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.. దీంతో అప్రమత్తమైన కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.. ఇక, ఈ కొత్త వేరియంట్పై రాజ్యసభలో క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. భారత్లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు.. ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభలో మాట్లాడిన ఆయన… ఒమిక్రాన్ వేరియంట్ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.. ఎయిర్పోర్ట్ల వద్ద స్క్రీనింగ్ చేస్తున్నామని, పాజిటివ్…
మన ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ…. ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,990 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 1,00,543 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 190 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 10,116 మంది కరోనా నుంచి…
సౌతాఫ్రికాలో కొత్త వేరియంట్ వెలుగు చూసిన తర్వాత ఆ దేశం నుంచి ఎవ్వరు వచ్చినా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది.. తాజాగా, సౌతాఫ్రికా నుంచి భారత్కు తిరిగి వచ్చిన మరో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్గా తేలింది.. బెంగళూరుకు వచ్చిన ఇద్దరికి, చండీగఢ్కు వచ్చిన ఒకరికి కోవిడ్ పాజిటివ్గా తేలినట్టు అధికారులు వెల్లడించారు.. అయితే, అది ఒమిక్రాన్ వేరియంటా అనే టెన్షన్ నెలకొనగా.. బెంగళూరుకు వచ్చిన వారిలో ఒకరిలో డెల్టా, మరొకరిలో డెల్టా ప్లస్కు భిన్నమైన వేరియంట్గా నిర్ధారించారు..…