Anand Mahindra: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు మహీంద్రా గ్రూప్ కంపెనీ చీఫ్ ఆనంద్ మహీంద్రా. సమకాలిన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తుంటారు. నెటిజన్లతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా అదాని-హిండెన్ బర్గ్ వ్యవహారంపై స్పందించారు. భారతదేశంపై ఎప్పుడు పందెం కాయొద్దు అని పాశ్చాత్య మీడియాకు వార్నింగ్ ఇచ్చారు.
Indian Firm Suspends Production Of Eye Drops Linked To Death In US: భారతదేశానికి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ తయారు చేసిన ఎజ్రీకేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ ఐడ్రాప్స్ వల్ల అమెరికాలో ఒకరు మరణించారు. పలువురికి కంటి చూపు సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ఎజ్రీకేర్ ఐ డ్రాప్స్ ను రీకాల్ చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఎజ్రీకేర్ వల్ల అమెరికాలోని 12 రాష్ట్రాల్లో 55 మంది వరకు దీని వల్ల ప్రభావితం అయ్యారు.
Apple: ప్రపంచం ఆర్థికమాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటోంది. అమెరికా, యూరోపియన్ మార్కెట్లు ఆశాజనకంగా లేవు. 6 నెలల నుంచి ఏడాది వ్యవధిలో మాంద్యం ఎప్పుడైనా రావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఒక్క భారత ఆర్థిక పరిస్థితి మాత్రమే ఆశాజనకంగా ఉంటుందని ఐఎంఎఫ్ తో పాటు పలు ఆర్థిక సంస్థలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధిలో ముందుకెళ్తున్నదని చెప్పారు. విస్తీర్ణంలో హైదరాబాద్ కన్నా సింగపూర్ చిన్నగా ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఎన్హెచ్ఆర్డీ ‘డీకోడ్ ది ఫ్యూచర్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.