భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంపై కీలక ప్రకటన చేసింది. చంద్రయాన్-3లో కీలకఘట్టం పూర్తి అయినట్లు ప్రకటించింది. చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చివరి డీబూస్టింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు శనివారం అర్ధరాత్రి దాటాక ఇస్రో ప్రకటించింది.
India’s Likely 17 member squad for Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆగస్టు 30 నుంచి ఆరంభం అవుతుంది. తొలి మ్యాచ్లో నేపాల్తో పాకిస్థాన్ తలపడనుంది. సెప్టెంబరు 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో 6 జట్లు పాల్గొంటుండగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ టీమ్స్ ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. భారత్ సహా శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్లు తమ టీమ్స్ ప్రకటించాల్సి ఉంది. సోమవారం (ఆగష్టు…
పై చదువుల కోసం చాలా మంది యువత నేటి కాలంలో దేశం విడిచి విదేశాలకు వెళుతున్నారు. అక్కడే ఎంతో మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. అయితే అక్కడికి వెళ్లిన వారిలో కొంతమంది స్వదేశానికి తిరిగి వస్తుండగా మరికొంత మంది అక్కడే సెటిల్ అయిపోతున్నారు. అయితే దేశంలో ఉన్నప్పుడు కాకరకాయ అని, ఫారెన్ వెళ్లి వచ్చాక కీకరకాయ అన్నాడు అనే సామెత మనం తరచూ వింటూ ఉంటాం. సేమ్ అలానే ప్రవర్తించి ఓ భారతీయ యువతి. ప్రస్తుతం…
సవాళ్ల సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను ఆశాకిరణంగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఈ సవాలు సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ ఆశాకిరణంలా ప్రకాశిస్తోందని ఆయన శనివారం అన్నారు.
దేశంలో ఉల్లి ధరలు పెరిగే సూచనలు కనిపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉల్లి ధరలను నియంత్రించడానికి తక్షణ చర్యలను చేపట్టింది. ఉల్లి ఎగుమతులపై భారీగా వడ్డన విధించింది. ఉల్లి ఎగుమతులపై వసూలు చేస్తోన్న పన్ను మొత్తాన్ని భారీగా పెంచింది. ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది.
మణిపూర్లో జీ20 ఈవెంట్ను నిర్వహించకపోవడంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శనివారం ప్రశ్నలు సంధించారు. జీ20 సమ్మిట్ను ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. మణిపూర్లో పరిస్థితి సాధారణ స్థితి నెలకొంటే జీ20 సదస్సును అక్కడ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
భారత్ మొదటి టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ఆరంభంలోనే కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా తన ప్రతాపాన్ని చూపించాడు. రీ ఎంట్రీ తర్వాత అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చాడు. తన మొదటి ఓవర్లలోనే ఐర్లాండ్ రెండు వికెట్లను పడగొట్టాడు.
భారత్, ఐర్లాండ్ మధ్య జరిగే తొలి టీ20 మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా.. తొలి మ్యాచ్ డబ్లిన్ లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 7.30 గంటలకు భారత్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.