Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News India Will Grow Into A 5 Trillion Dollar Economy Pm Modi

PM Modi: 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగనున్న భారత్‌: ప్రధాని మోడీ

Published Date :August 23, 2023 , 9:27 am
By Naga Maneendra
PM Modi: 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగనున్న భారత్‌: ప్రధాని మోడీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

BRICS Business Forum: భారత్‌ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని.. త్వరలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇండియాలో మిషన్‌ మోడ్‌ సంస్కరనలు భారత్‌లో సులభతర వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచాయని తెలిపారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో ప్రధాని పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరమ్‌ లీడర్స్‌ డైలాగ్‌లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. 2019 తర్వాత బ్రిక్స్ దేశాల తొలి వ్యక్తిగత సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కల్లోలం ఉన్నప్పటికీ, భారత్ నేడు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని అన్నారు. త్వరలోనే భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచ వృద్ధి చోదక శక్తిగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదని తెలిపారు.

Read Also: Telangana Cabinet: రేపు కేబినెట్ విస్తరణ.. పట్నం మహేందర్‌రెడ్డికి చోటు..!

రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధి ఇంజిన్ గా మారుతుంద‌ని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరం లీడర్స్ డైలాగ్ లో మోడీ మాట్లాడుతూ దేశ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని వ్యాపారులను ఆహ్వానించారు. డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ సాధించిన పురోగతి గురించి ప్రస్తావిస్తూ, బ్రిక్స్ కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ను ఉపయోగించడానికి అనేక అవకాశాలు ఉన్నాయని మోడీ పేర్కొన్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాలు కలిసి ప్రపంచ సంక్షేమానికి దోహదం చేయగలవని తెలిపారు. దేశం విపత్తులను, కష్టాలను ఆర్థిక పునరుద్ధరణకు అవకాశాలుగా మార్చుకుందని అన్నారు. ఇండియాలో తాము చేసిన సంస్కరణల ఫలితంగా ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నిరంతరం మెరుగుపడిందన్నారు. సామాజిక, ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి సాంకేతిక ఆధారిత పరిష్కారాలతో సహా చేపట్టిన సంస్కరణలు, రెడ్ టేప్ ను తొలగించడం ద్వారా రెడ్ కార్పెట్ ను అమలు చేస్తోందని తెలిపారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), దివాలా చట్టం అమలుతో ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగిందనీ, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని భారత ప్రజలు ప్రతిజ్ఞ చేశారని ప్రధాని పేర్కొన్నారు. భారత అభివృద్ధి ప్రయాణంలో చేరాలని వ్యాపారాలను ఆహ్వానించిన ప్రధాని.. రక్షణ, అంతరిక్షం వంటి రంగాలలోనూ ప్రైవేట్ పెట్టుబడులకు తెరలేపిందని తెలిపారు. లాజిస్టిక్స్ ఖర్చు తగ్గడం వల్ల తయారీ రంగం పోటీగా మారుతోందన్నారు. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి రంగాల్లో భారత్ ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ఆర్థిక సమ్మిళితం దిశగా భారత్ పెద్ద ముందడుగు వేసిందన్న ప్రధాని.. గ్రామీణ మహిళలు ఎక్కువ ప్రయోజనం పొందారని తెలిపారు. సింగపూర్, ఫ్రాన్స్ వంటి దేశాలు యూపీఐ ప్లాట్ ఫామ్ లో చేరుతున్నాయనీ, బ్రిక్స్ దేశాలతో కూడా దీనిపై పనిచేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయని మోడీ చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • $5 Trillion
  • BRICS
  • Economy
  • india
  • PM Modi

తాజావార్తలు

  • CM Revanth Reddy : అక్రమ మైనింగ్‌పై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం..

  • Trump: ఓడిపోయినోళ్లతో తిరగడమే ఇష్టం.. ప్రశ్నోత్తరాల్లో ట్రంప్ కీలక సంభాషణ

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • LPG: భారత్‌కు వస్తున్న 2 ఎల్పీజీ ట్యాంకర్లకు ఇరాన్ అనుమతి..

  • Gas Cylinder Robbery: గ్యాస్‌ సిలిండర్లతో డెలివరీ బాయ్‌ పరార్..

ట్రెండింగ్‌

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions