India Crorepati Club: ఆరేళ్లలో మూడు రెట్లు పెరిగిన కోటీశ్వరులు.. ఆ సీక్రెట్ చెప్పిండి బాసూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Crorepati Club: కొన్నేళ్లుగా దేశంలో ధనవంతుల సంఖ్య వేగంగా పెరిగింది. ధనవంతుల లెక్కలు అప్పుడప్పుడూ ఇలాగే రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆదాయపు పన్ను డేటా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. గత మూడేళ్లలో కొత్త మిలియనీర్ల సంఖ్య 50 శాతానికి పైగా పెరిగినట్లు ఆదాయపు పన్ను డేటా తెలుపుతోంది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. మూడేళ్లలో కోటి కంటే ఎక్కువ సంపాదించే కొత్త కోటీశ్వరులు దాదాపు 57,591పన్ను చెల్లింపుదారుల లిస్టులో జాయిన్ అయ్యారు. కోవిడ్కు ముందు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆ స్థాయిలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 1,11,939 ఉంటే, వారి సంఖ్య 2022-23లో 1,69,890కి పెరిగింది. మూడేళ్లలో ఇది 51 శాతం పెరుగుదల. 2016-17లో ఇలా పన్ను చెల్లింపుదారుల సంఖ్య 68,263 మాత్రమే.
Read Also:Pushpa2 : పుష్ప 2 రిజల్ట్ గురించి వేణు స్వామి ఏం చెప్పారో తెలుసా?
Also Read
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రభావం చాలా కాలంగా కొనసాగుతున్న సమయంలో ఈ గణాంకాలు పెరిగాయి. కరోనా కారణంగా దేశం నెలల తరబడి లాక్ డౌన్ చేయవలసి వచ్చింది. దీని కారణంగా లక్షలాది కర్మాగారాల్లో పనులు ఆగిపోయాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయారు. గత మూడేళ్లలో 2020-21లో కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య ఒక్కసారి మాత్రమే తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆ సమయంలో వారి సంఖ్య 81,653కి తగ్గింది. మిలియనీర్ పన్ను చెల్లింపుదారుల సంఖ్య ఈ పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆదాయం, పన్నులకు సంబంధించిన డేటా సేకరణ ప్రక్రియ పారదర్శకంగా, ప్రభావవంతంగా మారిందని పన్ను నిపుణులు అంటున్నారు. ఇవే కాకుండా స్టాక్ మార్కెట్ ర్యాలీ, స్టార్టప్ కంపెనీల ఆవిర్భావం, అధిక జీతభత్యాల ఉద్యోగాల్లో బూమ్, మూన్లైట్ వంటి అంశాలు కూడా కోటీశ్వరుల పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచాయి.
Read Also:Bhatti Vikramarka : ధరణి ఓ మహమ్మారి.. భూ కుంభకోణానికి దారి తీసింది
ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు గడువు ముగిసింది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి గడువు 31 జూలై 2023 వరకు ఉంది. అయితే, ఆ తర్వాత కూడా పన్ను చెల్లింపుదారులు రూ.1000 జరిమానా చెల్లించి రిటర్న్లు దాఖలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. గడువు తేదీ వరకు 6.75 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేశారు. ఇది గత సీజన్తో పోలిస్తే కోటి కంటే ఎక్కువ.
తాజావార్తలు
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!