ఆన్లైన్ పోర్టల్ న్యూస్క్లిక్ చైనా నుంచి నిధులు తీసుకుని దానికి అనుకూలంగా వార్తలు రాస్తున్నారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. భారత్ అల్టిమేటం ఇవ్వడంతో కెనడా చాలా మంది దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది.
A medal is assured for India in cricket in Asian Games 2023: 2023 ఆసియా గేమ్స్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్కు చేరుకుంది. హాంగ్జౌలోని పింగ్ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో శుక్రవారం ఉదయం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 9.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్ (40) కెప్టెన్ ఇన్నింగ్స్…
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆయన "చాలా తెలివైన వ్యక్తి" అని, మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెంతుతోందని ఆయన పొగిడారు. ఆర్థిక భద్రత, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాటంలో రష్యా, భారత్ మధ్య మరింత సహకారం ఉంటుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
India Wins 83 Medals in Asian Games 2023: ఆసియా గేమ్స్లో భారత్కు మరో స్వర్ణం లభించింది. స్క్వాష్లో భారత మిక్స్డ్ డబుల్స్ ద్వయం దీపికా పల్లికల్-హరిందర్ సంధు జోడీ గోల్డ్ మెడల్ సాధించారు. మలేషియాకు చెందిన ఐఫా బింటి అజ్మాన్ మరియు సయాఫిక్ కమల్ల జోడీని 11-10, 11-10 తేడాతో ఓడించారు. స్క్వాష్లో భారత్కు ఇది నాలుగో పతకం. పురుషుల జట్టు పాకిస్థాన్ను ఓడించి స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. మహిళల జట్టు, మిక్స్డ్…
India reach Archery Compound Women’s Team Final: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2023 బ్యాడ్మింటన్ ఈవెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. కనీసం కాంస్య పతకం అయినా తెస్తుందని ఆశించిన భారత్కు నిరాశే మిగిలింది. గురువారం ఉదయం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో సింధు 16-21, 12-21 తేడాతో హే బింగ్జియావో (చైనా) చేతిలో ఓడిపోయింది. తెలుగు తేజం కనీస పోటీ ఇవ్వకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.…
మరికొన్ని గంటల్లో ప్రపంచ కప్ మహా సంగ్రామం ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్లతో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ప్రపంచకప్కు సంబంధించిన A to Z వివరాలివే.
వన్డే ప్రపంచకప్ గెలవడం ఎంత ముఖ్యమో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కూడా అంతే ముఖ్యమని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. సామాన్యుడు పోటీని చాలా మక్కువతో పట్టించుకుంటాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
ప్రపంచకప్ ప్రారంభోత్సవానికి ముందు క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించడం లేదు. స్పోర్ట్స్ వెబ్సైట్ రెవ్ స్పోర్ట్స్ ప్రకారం.. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ బోర్డు ఈసారి ఈ వేడుకను నిర్వహించడం లేదని తెలుస్తోంది.
2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు.. సెమీ ఫైనల్ లోనే ఓటిమిని చవిచూడల్సి వచ్చింది. కానీ ఈసారి ఆసియా గేమ్స్ లో భారత పురుషుల జట్టు ఫైనల్ కు చేరుకుంది. సెమీఫైనల్లో దక్షిణ కొరియాను 5-3తో ఓడించింది. దీంతో.. భారత జట్టు ఫైనల్స్కు చేరుకుంది.