Mission Gaganyaan: మానవసహిత గగన్యాన్ మిషన్.. కీలక పరీక్షలకు ఇస్రో సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mission Gaganyaan: మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించి ఇస్రో కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ మిషన్కు సంబంధించి మానవ రహిత విమాన పరీక్షలను ప్రారంభించనుంది. ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 (TV-D1) కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది క్రూ ఎస్కేప్ సిస్టమ్ పనితీరు గురించి సమాచారాన్ని అందిస్తుంది. అత్యవసర సందర్భాల్లో వ్యోమగాములను సురక్షితంగా భూమికి చేర్చేందుకు ఉద్దేశించిన క్రూ ఎస్కేప్ వ్యవస్థను త్వరలో పరీక్షించనుంది. ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 పేరిట ఈ పరీక్షను ఇస్రో నిర్వహిస్తోంది. ఇందుకోసం ఓ ప్రయోగాత్మక క్రూ మాడ్యుల్తో పాటూ క్రూ ఎస్కేప్ వ్యవస్థను రూపొందించింది.
Also Read: India-Canada Row: ఇండియా-కెనడా వివాదంపై స్పందించిన రిషి సునాక్.. ఏమన్నారంటే..?.
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
ఈ క్రమంలో రాకెట్ నుంచి విడివడే క్రూ మాడ్యుల్ పారాషూట్ల సాయంతో బంగాళాఖాతంలో దిగుతుంది. ఈ సందర్భంగా వ్యోమగాముల రక్షణకు ఏర్పాటు చేసిన వ్యవస్థల పనితీరును మాడ్యూల్లోని వివిధ పరికరాలతో శాస్త్రవేత్తలు సేకరిస్తారు. క్రూ మాడ్యూల్ను స్వాధీనం చేసుకున్నాక అందులోని డాటా ఆధారంగా మరిన్ని మెరుగులు దిద్దుతారు. త్వరలో ఫ్లైట్ టెస్ట్ అబార్ట్ మిషన్ చేపడతామని ఇస్రో తాజాగా వెల్లడించింది. టెస్ట్ వెహికల్ TV-D1 అనేది ఈ అబార్ట్ మిషన్ కోసం అభివృద్ధి చేయబడిన ఒకే-దశ లిక్విడ్ రాకెట్. పేలోడ్లు క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్లను కలిగి ఉంటాయి.
Also Read: Russia: కిమ్-పుతిన్ భేటీ తర్వాత పెరిగిన రైళ్ల రాకపోకలు.. కారణం అదేనా..?
మానవ రహిత ప్రయోగాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించనున్నారు. గగన్యాన్ మిషన్ సమయంలో వ్యోమగాములు కూర్చునే క్రూ మాడ్యూల్ 17 కి.మీ ఎత్తులో విడిపోతుంది. బంగాళాఖాతంలో తాకిన తర్వాత క్రూ మాడ్యూల్ను భారత నావికాదళానికి చెందిన ప్రత్యేక నౌక, డైవింగ్ బృందాన్ని ఉపయోగించి తిరిగి పొందుతామని ఇస్రో తెలిపింది. ఈ విమాన పరీక్ష గగన్యాన్ మిషన్కు కీలకమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అవి ప్రాజెక్ట్ ముఖ్య భద్రతా లక్షణం.
ప్రతిష్టాత్మకమైన గగన్యాన్ ప్రాజెక్ట్ ఇద్దరు ముగ్గురు సభ్యులతో కూడిన సిబ్బందిని ఒకటి నుంచి మూడు రోజుల మిషన్ కోసం భూమి చుట్టూ 400 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి తీసుకెళ్లి వారిని సురక్షితంగా భూమికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!