India – Maldives row: సైనికుల ఉపసంహరణపై భారత్-మాల్దీవుల మధ్య కీలక చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India – Maldives: భారత్ – మాల్దీవుల మధ్య వివాదం నేపథ్యంలో కీలక పరిణామం నెలకొంది. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. ఉగాండా రాజధాని నగరం కంపాలాలో మాల్దీవుల విదేశామంగ మంత్రి మూసా జమీర్తో భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.. రెండు రోజుల నామ్ శిఖరాగ్ర సదస్సులో వీరిద్దరూ సమావేశం అయ్యారు. ఇక, ఈ విషయాన్ని జైశంకర్ ఎక్స్( ట్విట్టర్ ) వేదికగా తెలియజేశారు. అయితే, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్తో జరిగిన భేటీలో భారత్ -మాల్దీవుల సంబంధాలపై స్పష్టమైన సంభాషణ జరిగింది అని జైశంకర్ తెలిపారు. నామ్ (NAM) సంబంధిత అంశాలను కూడా చర్చించామన్నారు.
Read Also: Naa Saami Ranga collections : ఐదో రోజు నాగార్జున మూవీ కలెక్షన్స్..అన్ని కోట్లు వస్తే హిట్..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఇక, మూసా జమీర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నామ్ సమ్మిట్లో భాగంగా జైశంకర్ని కలవడం సంతోషంగా ఉందని తెలిపారు. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ, మాల్దీవులలో కొనసాగుతున్న డెవలప్మెంట్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, సార్క్, నామ్ల సహకారంపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. సార్క్, నామ్ల బలోపేతం, విస్తరణకు మాల్దీవుల సహకారం ఉంటుందన్నారు. జైశంకర్తో దిగిన ఫొటోని మూసా షేర్ చేశారు.
Read Also: Coaching Centers: ఆ స్టూడెంట్స్ ను చేర్చుకోవద్దు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు..
కాగా, భారత ప్రధాని మోడీ లక్షదీప్ను సందర్శించడంపై మాల్దీవులు మంత్రులు విమర్శలు చేయడంతో.. ‘బాయ్కాట్ మాల్దీవులు’ పేరిట భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బ తిన్నాయి. చైనా అనుకూలంగా పని చేస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ ఇటీవలే తమ దేశంలోని భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని కీలక ప్రకటన చేసింది.
Met Maldives FM @MoosaZameer today in Kampala.
A frank conversation on 🇮🇳-🇲🇻 ties. Also discussed NAM related issues. pic.twitter.com/P7ResFlCaK
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 18, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!