రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జ్ సహా ఇంఛార్జిలను నియమించింది బీజేపీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జ్గా వ్యవహరించిన ప్రకాశ్ జవదేకర్ను కేరళ ఇంఛార్జ్గా నియమించింది. అండమాన్ నికోబార్కు సత్యకుమార్, అరుణాచల్ ప్రదేశ్కు అశోక్ సింఘాల్, చండీగఢ్కు విజయభాయ్ రూపానీ, గోవాకు ఆషిశ్ సూద్, డయ్యూ డామన్కు పూర్ణేశ్ మోదీ, హర్యానాకు బిప్లవ్ కుమార్ దేవ్, హిమాచల్ ప్రదేశ్కు శ్రీకాంత్ శర్మలను నియమించింది బీజేపీ హైకమాండ్.
లోక్సభ ఎన్నికల వేళ భారతదేశంలో ఓటర్లకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశంలో త్వరలో రానున్న లోక్సభ ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని తెలిపింది.
India-Maldives Row: ఇండియా, మాల్దీవుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీపై అక్కడి మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండియా ప్రజలు మాల్దీవులపై తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మాల్దీవ్స్ పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనా అనుకూలంగా వ్యవహరించడం, భారత్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదం అయ్యాయి.
Ukraine: ఉక్రెయిన్ ప్రధాని డేనిస్ హ్మిహాల్ ప్రధాని నరేంద్రమోడీని ‘గ్లోబల్ లీడర్’ అని ప్రశంసించారు. యుద్ధంతో దెబ్బతిన్న తమ దేశ ఆర్థిక వ్యవస్థను పునురద్ధరించడానికి భారత్ సాయం చేయాలని కోరాడు. భారత విద్యార్థులను తమ దేశానికి పంపండం ద్వారా మునుపటిలా వాణిజ్యం చేయడం ద్వారా భారతదేశాన్ని సాయం చేయాలని అభ్యర్థించాడు.
హైదరాబాద్ వేదికగా ఇండియా- ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో.. టాస్ గెలిచిన ఇంగ్లీష్ టీమ్ తొలుత బ్యాటింగ్ చేసింది. కాగా.. మొదటి ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. మొదటి రోజు 119 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. రెండవ రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఈరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి…
75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో యంగ్ లీకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది.
భారత్తో సరిహద్దు వివాదంపై డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ద్వైపాక్షిక సంబంధాలను సరిహద్దు వివాదంతో ముడిపెట్టడం సరికాదని వెల్లడించింది. డ్రాగన్ కంట్రీ చర్యల ఫలితంగానే తూర్పు లద్ధాఖ్లోని గల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా, భారత్లోని రష్యా రాయబార కార్యాలయం ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. రష్యా రాయబార కార్యాలయం ఓ వీడియోను షేర్ చేసి 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపింది.
India on Pak: గతేడాది పాకిస్తాన్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. అయితే ఈ హత్యల్లో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ఆరోపించారు. అయితే, పాకిస్తాన్ ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండగించింది. పాక్ ఆరోపణలు భారత వ్యతిరేక ప్రచారాన్ని పెంపొందించడానికి తాజా ప్రయత్నమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
Pakistan: ఇటీవల కాలంలో పాకిస్తాన్లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా గుర్తుతెలియని వ్యక్తుల చంపుతున్నారు. అయితే ఈ హత్యల వెనక భారత్ ఉందని పాక్ ప్రభుత్వం అంతర్గతంగా అనుకుంటున్నప్పటికీ.. ఎప్పుడూ కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. అయితే తొలిసారిగా పాక్ విదేశాంగ కార్యదర్శి సైరస్ సజ్జాద్ భారత్పై సంచలన ఆరోపణలు చేశారు. ఇద్దరు భారత ఏజెంట్లు యోగేష్ కుమార్, అశోక్ కుమార్ ఆనంద్లు పాకిస్తాన్ గడ్డపై ఇద్దరు పాకిస్తానీలను హత్యల్లో ప్రయేయం ఉందని ఆరోపించారు.