Maldives Election: మాల్దీవులలో ఎన్నికలు.. భారత్లో బ్యాలెట్ బాక్స్లు?.. విషయం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives Election: మాల్దీవుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను భారత్, శ్రీలంక,మలేషియాలో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది. సుమారు 11,000 మంది మాల్దీవులకు చెందినవారు తమ పోలింగ్ స్టేషన్లను తరలించడానికి రీ-రిజిస్ట్రేషన్ అభ్యర్థనలు సమర్పించారని ఆ దేశ ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఏప్రిల్ 21న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం శనివారం కోరింది.
మాల్దీవుల ఎన్నికల బ్యాలెట్ బాక్సులను కేరళ రాజధాని తిరువనంతపురం, శ్రీలంకలోని కొలంబో, మలేషియాలోని కౌలాలంపూర్లో కూడా ఉంచుతామని ఎన్నికల కమిషన్ తెలిపింది. మూడు దేశాల్లో కనీసం బ్యాలెట్ బాక్స్ పెట్టేందుకు అవసరమైన ఓటర్ల తమ పేరును నమోదు చేసుకున్నారని పేర్కొంది. ఇతర దేశాల్లో నివసిస్తున్న పౌరుల కోసం రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించబడిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. వెబ్ పోర్టల్ ‘Adadhu.com’ ప్రకారం, ఎన్నికల కమిషన్ సెక్రటరీ జనరల్ హసన్ జకారియా మాట్లాడుతూ.. “గతంలో లాగా, శ్రీలంక, మలేషియాలో చాలా మంది నమోదు చేసుకున్నారు. భారతదేశంలోని తిరువనంతపురంలో 150 మంది నమోదు చేసుకున్నారు, కాబట్టి మేము అక్కడ బ్యాలెట్ పెట్టెను ఉంచాలని నిర్ణయించుకున్నాము.” అని తెలిపారు.
Also Read
Read Also: Vladimir Putin : రష్యాలో ఏకపక్ష విజయం.. చైనా, దేశద్రోహులపై కీలక వ్యాఖ్యలు చేసిన పుతిన్
ఈ సమయంలో వివిధ పోలింగ్ కేంద్రాల్లో తిరిగి నమోదు చేసుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్కు 11,169 దరఖాస్తులు వచ్చాయి. న్యూస్ పోర్టల్ ‘Edition.mv’ ప్రకారం, కమిషన్ 1,141 ఫారమ్లను తిరస్కరించింది. నమోదు కోసం మొత్తం దరఖాస్తుల సంఖ్య 10,028కి చేరుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది తిరిగి నమోదు చేసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉందని పేర్కొన్న జకారియా.. బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), థాయ్లాండ్లలో ఓటింగ్ జరగదని చెప్పారు.
మాల్దీవుల్లో పార్లమెంటరీ ఎన్నికలు ఆదివారం జరగాల్సి ఉండగా, రంజాన్ మాసంలో ఎన్నికలు నిర్వహించకుండా చట్టాన్ని సవరించడంతో ఎన్నికల తేదీని వాయిదా వేశారు. ఇప్పుడు ఏప్రిల్ 21న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మాల్దీవుల్లోని 93 పార్లమెంట్ స్థానాలకు మొత్తం 389 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 90 స్థానాల్లో పోటీ చేస్తున్న ప్రధాన భారత అనుకూల ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP) నుండి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నారు. దీని తర్వాత 89 స్థానాల్లో పోటీ చేస్తున్న ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (PPM), పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC)ల పాలక కూటమి ఉంది. చైనా అనుకూల వ్యక్తిగా భావించే అధ్యక్షుడు మహ్మద్ ముయిజు గత ఏడాది భారత వ్యతిరేక వైఖరితో అధికారంలోకి వచ్చారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!