Maldives Election: మాల్దీవులలో ఎన్నికలు.. భారత్లో బ్యాలెట్ బాక్స్లు?.. విషయం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives Election: మాల్దీవుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను భారత్, శ్రీలంక,మలేషియాలో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది. సుమారు 11,000 మంది మాల్దీవులకు చెందినవారు తమ పోలింగ్ స్టేషన్లను తరలించడానికి రీ-రిజిస్ట్రేషన్ అభ్యర్థనలు సమర్పించారని ఆ దేశ ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఏప్రిల్ 21న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం శనివారం కోరింది.
మాల్దీవుల ఎన్నికల బ్యాలెట్ బాక్సులను కేరళ రాజధాని తిరువనంతపురం, శ్రీలంకలోని కొలంబో, మలేషియాలోని కౌలాలంపూర్లో కూడా ఉంచుతామని ఎన్నికల కమిషన్ తెలిపింది. మూడు దేశాల్లో కనీసం బ్యాలెట్ బాక్స్ పెట్టేందుకు అవసరమైన ఓటర్ల తమ పేరును నమోదు చేసుకున్నారని పేర్కొంది. ఇతర దేశాల్లో నివసిస్తున్న పౌరుల కోసం రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించబడిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. వెబ్ పోర్టల్ ‘Adadhu.com’ ప్రకారం, ఎన్నికల కమిషన్ సెక్రటరీ జనరల్ హసన్ జకారియా మాట్లాడుతూ.. “గతంలో లాగా, శ్రీలంక, మలేషియాలో చాలా మంది నమోదు చేసుకున్నారు. భారతదేశంలోని తిరువనంతపురంలో 150 మంది నమోదు చేసుకున్నారు, కాబట్టి మేము అక్కడ బ్యాలెట్ పెట్టెను ఉంచాలని నిర్ణయించుకున్నాము.” అని తెలిపారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
Read Also: Vladimir Putin : రష్యాలో ఏకపక్ష విజయం.. చైనా, దేశద్రోహులపై కీలక వ్యాఖ్యలు చేసిన పుతిన్
ఈ సమయంలో వివిధ పోలింగ్ కేంద్రాల్లో తిరిగి నమోదు చేసుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్కు 11,169 దరఖాస్తులు వచ్చాయి. న్యూస్ పోర్టల్ ‘Edition.mv’ ప్రకారం, కమిషన్ 1,141 ఫారమ్లను తిరస్కరించింది. నమోదు కోసం మొత్తం దరఖాస్తుల సంఖ్య 10,028కి చేరుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది తిరిగి నమోదు చేసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉందని పేర్కొన్న జకారియా.. బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), థాయ్లాండ్లలో ఓటింగ్ జరగదని చెప్పారు.
మాల్దీవుల్లో పార్లమెంటరీ ఎన్నికలు ఆదివారం జరగాల్సి ఉండగా, రంజాన్ మాసంలో ఎన్నికలు నిర్వహించకుండా చట్టాన్ని సవరించడంతో ఎన్నికల తేదీని వాయిదా వేశారు. ఇప్పుడు ఏప్రిల్ 21న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మాల్దీవుల్లోని 93 పార్లమెంట్ స్థానాలకు మొత్తం 389 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 90 స్థానాల్లో పోటీ చేస్తున్న ప్రధాన భారత అనుకూల ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP) నుండి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నారు. దీని తర్వాత 89 స్థానాల్లో పోటీ చేస్తున్న ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (PPM), పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC)ల పాలక కూటమి ఉంది. చైనా అనుకూల వ్యక్తిగా భావించే అధ్యక్షుడు మహ్మద్ ముయిజు గత ఏడాది భారత వ్యతిరేక వైఖరితో అధికారంలోకి వచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!