హీరో కంపెనీ నుంచి ఎక్స్ట్రీమ్ 160ఆర్ బైక్ విడుదల అయింది. ఈ మోడల్ బైక్లో కంపెనీ కొన్ని కొత్త ఫీచర్లను చేర్చింది. స్పెసిఫికేషన్లలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అలాగే.. లుక్, డిజైన్ చాలా వరకు ఒకే విధంగా ఉన్నాయి. Xtreme 160R 2V సింగిల్ డిస్క్ వేరియంట్తో స్టీల్త్ బ్లాక్ కలర్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ బైక్ ధర రూ.1,11,111 ఎక్స్-షోరూమ్.
Jaishankar talked about Israel and Hamas issue: సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో వ్యూహాత్మక చర్చల కోసం భారత్ – గల్ఫ్ సహకార మండలి (GCC) తొలి మంత్రివర్గ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాలస్తీనాలోని పరిస్థితులపై మాట్లాడారు. ఎస్. జైశంకర్ గాజాలో పరిస్థితిని భారతదేశం యొక్క “అతిపెద్ద ఆందోళన” గా అభివర్ణించారు. అలాగే భారతదేశం ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణకు అనుకూలంగా ఉందని తెలిపారు. iPhone 16…
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన కేసులో సుప్రీంకోర్టు వీలైనంత త్వరగా తీర్పునివ్వాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరారు. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు.. ఇలాంటి దారుణాలకు పాల్పడాలనే ఆలోచన వచ్చినా వణుకుపుట్టేలా తీర్పు ఉండాలని దాదా పేర్కొన్నాడు.
Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరలోనే భారతదేశ పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఇంకా పర్యటన తేదీలు ఖరారు కానప్పటికీ.. ఈ ఏడాది చివరి నాటికి భారత్లో పర్యటించే ఛాన్స్ ఉందని ఉక్రెయిన్ రాయబారి తెలిపారు.
First Mpox Case In India: మంకీపాక్స్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో అలజడి రేపిన ఈ వైరస్ భారత్లోకి ప్రవేశించింది. భారత్లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా తెలిపింది.